-వక్ఫ్ బోర్డు అవగాహన సదస్సు లో బీజేపీ అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్
నరసరావుపేట: వక్ఫ్ భూములను కొందరు స్వార్థం తో వినియోగించు కుంటున్నారని దేశం లో 9 లక్షలకు పైగా భూములు వక్ఫ్ పేరుతో పోగు బడి ఉన్నాయి. వాటిని కొందరు అమ్ముకుంటూ నిజమైన పేద ముస్లీమ్ లకు అన్యాయం చేస్తున్నారు. వక్ఫ్ భూములు ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ప్రజల జీవితం మారడం కోసం వినియోగించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
కాంగ్రెస్ పార్టీ ముస్లీమ్ లను ఓటు బ్యాంకు గా వినియోగించు కోవడం తప్పా వారి జీవితాల్లో మార్పు కోసం ఏ ప్రయత్నం చెయ్యలేదు. బీజేపీ ని ముస్లిం లకు వ్యతిరేకం అని ప్రచారం కాంగ్రెస్ చేసింది. తలాక్ తలాక్ బిల్లు తేవడం ద్వారా ముస్లిం మహిళలకు నరేంద్ర మోడీ ఎంతో మేలు చేశారు.
బీజేపీ నాయకుడు రవి చంద్రా రెడ్డి మాట్లాడుతూ.. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసమే కేంద్రం బిల్లు.. తీసుకొచ్చిందని అన్నారు. తమిళనాడు లాంటి కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా హిందువులు ఎలుబడి లో వున్న భూములు కూడా వక్ఫ్ ఆస్తులు గా ప్రకటించి వివాదం సృష్టిస్తున్నారని అన్నారు.
వక్ఫ్ అనేది ఇస్లామిక్ చట్టం ప్రకారం ఇవ్వబడిన, తిరిగి ఇవ్వలేని దాతృత్వ నిధి అన్నారు. 1996 క్రింద గుర్తించబడి చేయబడుతుందని అన్నారు.70% వక్ఫ్ ఆస్తులు ఆక్రమణ లకు గురై షాపింగ్ మాల్స్ హోటళ్లు గా మరాయని అన్నారు.
పల్నాడు జిల్లా మైనారిటీ అధ్యక్షులు, అమ్మా జిలాని మాట్లాడుతూ.. దేశం లోని ప్రజలందరూ మోడీ వెంట ఉన్నారని అన్నారు. ఏలూరి శశి కుమార్ అధ్యక్షత వహించగా, జిల్లా ఇంచార్జి కొక్కెర శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యలు వల్లెపు కృపారావు, మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్ర రావు పార్లమెంట్ సంయోజిక్ ఆదినారాయణ, పల్నాటి జిల్లా ప్రధాన కార్యదర్శులు, కే. హనుమంతరావు, కామినేని హనుమంతరావు, మేడం రమేష్ తదితరులు పాల్గొన్నారు