ఖాకీలపై వేటు వేసిన వరంగల్ సీపీ

పిడిఎస్ రైస్ అక్రమ రవాణాకు సంబంధించి నిందితులపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వారి నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతుడంతో పాటు ఇతరత్రా అక్రమ వసూళ్లకు కూడా పాల్పడుతున్నట్లుగా వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో పలువురు పోలీసులను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. టాస్క్ ఫోర్స్ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ వి.నరేష్ కుమార్ తో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పి. శ్యాంసుందర్, కె.సోమలింగం, కానిస్టేబుల్ బి.సృజన్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply