ఓయూ సిబ్బంది,వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నాం

-ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, చరిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఖ్యాతిని పెంపొందించేందుకు కృషి చేస్తూనే వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లోని వివిధ క్యాంపుల నివాసులు, ఉద్యోగులు తమ ప్రాంతంలో విద్యుత్ సమస్యల పై సోమవారం ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తో సమావేశమై, వారి సమస్యలను విపులీకరించారు. దాంతో వెంటనే స్పందించిన ఉప సభాపతి  పద్మారావు గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ తో సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ మేయర్  మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎం ఎల్ ఏ కోదండ రెడ్డి, ఓ యూ ఓఎస్ డీ ప్రొఫెసర్ రెడ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ…. ప్రభుత్వ పరంగా ఓ యూ అభివృద్దికి సంపూర్ణ సహకారం లభించేలా కృషి చేస్తామని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారంలో ఓ యూ అధికార యంత్రాంగం సహకరించాలని కోరారు. వివిధ క్యాంపుల్లో నివసించే వారికి విద్యుత్ సరఫరా సాఫీగా సాగేలా ఏర్పాట్లు జరపాలని సూచించారు.

Leave a Reply