Suryaa.co.in

Telangana

ఒక వ్యక్తిని, శక్తిని కోల్పోయాం

– మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: రామోజీరావు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రామోజీరావులో అందరూ ఓ గంభీరమైన వ్యక్తిని చూసుంటారు. కానీ, నేను ఆయనలో ఓ చిన్న పిల్లాడిని చూశాను. ప్రజారాజ్యం పార్టీని నడుపుతున్న సమయంలో ఆయనకు ఓ పెన్ను బహూకరించాను. దాన్ని చూసి మురిసిపోయారు. ఆయన దగ్గరున్న పెన్నుల కలెక్షన్ నాకు చూపించారు. తన ఆలోచనలకు తగినట్లుగా వాటిని వినియోగిస్తూ అక్షర రూపం ఇచ్చేవారు. అలాంటి ఒక వ్యక్తిని, శక్తిని ఈ రోజున మనం కోల్పోయాం.” అని చెప్పారు.

LEAVE A RESPONSE