– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి: యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించింది… ప్రతి ఏటా మెగా డీఎస్సీ నిర్వహించి యువ ఉపాధ్యాయులతో విద్య రంగాన్ని దేశంలోనే తొలి స్థానంలో నిలబెడతామని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ లో దివ్యాంగ అభ్యర్థులకు వయసు మినహాయింపు ఇచ్చి వారికి అండగా నిలబడ్డామని ఆయన అన్నారు. యువత బాగుపడటం ఇష్టంలేని జగన్మోహన్ రెడ్డి మెగా డీఎస్సీని ఆపడానికి 24 కేసులు వేయించారు… అవన్నీ తట్టుకుని “మెగా డీఎస్సీ” ప్రక్రియను పూర్తి చేసిన ఘనత లోకేష్ కి దక్కుతుందన్నారు.
విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు… స్టూడెంట్ – టీచర్ రేషియో కి సరిపడా ఉపాధ్యాయులు ఉంటేనే విద్యారంగ ముఖచిత్రం మార్చగలిగేది అని నమ్మిన విద్యావంతుడు లోకేష్ నాయకత్వంలో యువత కల నిజమైందన్నారు. ప్రభుత్వ విద్యలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేస్తూ బడులకు నూతన వెలుగులు నారా లోకేష్ తెస్తున్నారన్నారు.