Suryaa.co.in

Andhra Pradesh

పోలవరం నిర్వాసితుల జీవన పరిస్ధితులు మెరుగుపరుస్తాం

– నిర్వాసితులకు అంత్యోదయ అన్న యోజన కార్డులను అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్..

ఏలూరు/బట్టాయిగూడెం,ఏప్రిల్, 22: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ చెప్పారు.

మంగళవారం బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం లోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు అంత్యోదయ అన్న యోజన కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కాలనీలోని నిర్వాసితుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ బహుళర్ధసాధక సాగునీటి ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తమ భూములు త్యాగంచేసిన 35 వేల మంది నిర్వాసితుల త్యాగాలను తమ ప్రభుత్వం ఎప్పటికీ మరచిపోదని, వారిని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం పర్యటన సందర్భంగా నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వాటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. నిర్వాసితులకు ఆహార భద్రతాకీ అంత్యోదయ అన్నా యోజన కార్డులు అందజేసి వారికి ప్రతినెలా 35 కేజిల బియ్యన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు.

LEAVE A RESPONSE