Suryaa.co.in

Andhra Pradesh

భవిష్యత్తులో మంగళగిరిని ఐటీ హబ్‌గా మారుస్తాం

-అవకాయ పట్టాలన్నా…ఐటీ కంపెనీ నడపాలన్నా మహిళలకే సాధ్యం
-ఇంతమంది మహిళలు పనిచేయడం మొదటిసారి చూస్తున్నా
-కష్టపడే తత్వం, పట్టుదలతో సమాజంలో వారికి ప్రత్యేక గుర్తింపు
-టీడీపీ వచ్చాక నిరుద్యోగం మాట వినపడదు
-ఆలోచించి ఓటేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
-పై కేర్‌ కంపెనీ ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి ముఖాముఖి

మంగళగిరి: కష్టపడే తత్వం, పట్టుదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ఆటోనగర్‌లోని పై కేర్‌ డేటా సెంటర్‌ను ఆమె సందర్శించారు. 2017లో ఐటీ మంత్రిగా నారా లోకేష్‌ ఆహ్వానం మేరకు పై కేర్‌ కంపెనీ మంగళగిరికి వచ్చింది. ఇందులో ప్రస్తుతం 635 మంది ఉద్యోగం చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ సరైన ప్రోత్సాహం ఇస్తే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు. రాష్ట్రంలో ఒక ఐటీ కంపెనీలో ఇంత మంది మహిళలు పనిచేయడం తాను మొదటిసారి చూస్తున్నాను.

ఈరోజు నేను హెరిటేజ్‌ ఫుడ్స్‌, బసవ తారకం క్యాన్సర్‌ ఆసుపత్రి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు నా భర్త నారా లోకేష్‌, మా అత్తమామల సహకారమే కారణం. గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వెళ్లిపోయాయి. కొత్త కంపెనీల జాడ లేదు. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. నేను మీ యువతను కోరేది ఒక్కటే. జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి.. మన ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నిరుద్యోగం అనే మాట వినబడదు. రాబోయే కాలంలో ఈ పై కేర్‌ కంపెనీ 10 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని నాకు నమ్మకం ఉందని తెలిపారు.

కంపెనీ చైర్మన్‌ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ 2014-19 మధ్య ఏపీకి వచ్చిన మొట్టమొదటి ఐటీ కంపెనీ మా పై కేర్‌ డేటా సెంటర్‌. యువత కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నారా లోకేష్‌ ఎంతో తపన పడేవారు. ఆయన ప్రోత్సాహంతోనే మంగళగిరిలో కంపెనీ ప్రారంభించాం. ఈ ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహకారం అందలే దు. అయినప్పటికీ మేము ధైర్యంగా కంపెనీ నడుపుతున్నాం. భవిష్యత్తులో మరింత మందికి ఉద్యోగా వకాశాలు కల్పిస్తామని తెలిపారు. నారా బ్రాహ్మణితో మాట్లాడేందుకు ఐటీ ఉద్యోగులు ఉత్సాహం కనబరిచారు. కార్యక్రమం జరిగినంత సేపు కంపెనీ ప్రాంగణమంతా జై బాలయ్య నినాదాలతో హోరెత్తింది.

LEAVE A RESPONSE