Suryaa.co.in

Andhra Pradesh

రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలి

-జగన్‌ కు మరో అవకాశం ఇస్తే భవిష్యత్తు లేదు
-కొమెరపూడిలో కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం
-పాలాభిషేకాలతో స్వాగతం పలికిన గ్రామస్తులు
-గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ

సత్తెనపల్లి రూరల్‌ మండలం కొమెరపూడి గ్రామంలో బుధవారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పెద్దఎత్తున గ్రామస్తులు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా చదవుకునే ప్రతి బిడ్డకు రూ.15 వేలు, రైతులకు ఏడాదికి రూ.20 ఆర్థికసాయం, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి, ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇంటింటికీ ఉచితంగా రక్షిత తాగునీరు తదితర పథకాలను సూపర్‌ 6 పేరుతో అమలు చేయనున్నట్లు తెలిపారు. పేదలను ధనికులు చేసేందుకు చంద్రబాబు ప్రణాళిక రూపొందించారని వివరించారు.

జగన్‌ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైందని, సంపద దోపిడీ జరిగిందని విమర్శించారు. ప్రజాస్వామ్యం రాక్షసుల దాడికి గురైందని, ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి జగన్‌ ప్రజలను పీక్కుతింటున్నాడని, ఈ బహుదూర్‌ ప్రభుత్వాన్ని సాగనంపుదామని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నెరవేర్చకుండా మళ్లీ కొత్త మేనిఫెస్టో జగన్‌ నాటకం ఆడుతున్నాడు. ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి సాగినంపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్తును మార్చే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామని కోరారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే చంద్రన్న పాలన కోసం రాష్ట్రం ఎదురుచూ స్తోంది.. రాబోయే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలను అత్యధి క మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE