వక్ఫ్ ఆస్తులు స్వాదినపరుచుకుంటాం

– మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్

చిత్తూరు: శనివారం ఉదయం చిత్తూరు నగర, ప్రకాశం రోడ్డులోని వక్ఫ్ ఆస్తులను మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియా సందర్శించారు. ఆయన మాట్లాడుతూ త్వరలో వక్ఫ్ ట్రిబ్యునల్ ద్వారా, చట్టరీత్యా చర్యలు తీసుకొని వక్ఫ్ ఆస్తులను స్వాధీనపరచుకుంటామని తెలిపారు. సర్వేనెంబర్ 602/1A లోనీ ఇక్తేదర్ అలీ ఖాన్ దర్గా కు సంబంధించిన వక్ఫ్ స్థలాన్ని వక్ఫ్ ట్రిబ్యునల్ ద్వారా త్వరలో స్వాధీనం చేసుకుంటామని అన్నారు. స్థలం సందర్శించిన వారిలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఆడిటర్ అలీం బాషా, శేషాపీరాన్ మసీదు అధ్యక్షులు, కార్యదర్శి హనీషా, అఫ్జల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply