రాముడి విగ్రహం ద్వంసం జరిగి ఏడాదయినా సీఐడీ ఏం చేస్తోంది?

-రాముడి విగ్రహ విధ్వంసకులు అరెస్టు చేయకపోవడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే
– జగన్ రెడ్డికి దేవాలయాల ఆస్తుల మీద ఉన్న శ్రద్ద వాటి భద్రత, అభివృద్దిపై లేదు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు

ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన రామతీర్థంలోని బోడికొండపై 400 ఏళ్ల చరిత్ర కల్గిన శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు‎ ధ్వంసం చేసి సంవత్సరం పూర్తవుతోంది. కానీ ఇంతవరకు నిందితులపై ఎలాంటి చర్యలు లేకపోవటం హిందువులను అవమానించటం, వారి మనోభావాల్ని దెబ్బతీయటమే. మర్దర్ జరిగినా 24 గంటల్లో పట్టుకునే టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కోట్లాదిమంది భక్తులు నిత్యం పూజించే శ్రీరాముడి విగ్రహం ద్వంసం చేస్తే నిందితులను ఇంతవరకు పట్టులేకపోవటం ‎ వైసీపీ ప్రభుత్వ చేతకానితనం, జగన్ రెడ్డి హిందూమతం మట్ల అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి నిదర్శనం.

జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు, విగ్రహ ద్వంసం ఘటనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 230 పైగా దేవాలయాలపై దాడులు జరిగినా ఇంతవరకు ఏ ఒక్క ఘటనలోనూ నిందితులపై చర్యలు తీసుకోలేదంటే అర్ధం ఏంటి? జగన్ రెడ్డి హిందూమతం పట్ల అనుసరిస్తున్న వైఖరికి ఇదే నిదర్శనం. మొదటి సారి దేవాలయంపై దాడి జరిగినపుడే నిందితులపై చర్యలు తీసుకుంటే మిగతా దేవాలయాలపై ఇన్ని దాడులు జరిగేవా?

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణ ఏమైంది? ఎంతమంది దోషుల్ని పట్టుకున్నారు? వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దేవాలయాలను అభివృద్ది చేయకపోగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నా చోద్యం చూడటం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దేవాలయాల ఆస్తులు, భూములు మీద ఉన్న శ్రద్ద దేవాలయాల భద్రత, అభివృద్దిపై లేకపోవటం సిగ్గుచేటు. జగన్ రెడ్డి తన స్వార్దం కోసం మతాల మద్య విధ్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటమే తప్ప మత సామరస్యాన్ని ఎలా కాపాడాలో జగన్ రెడ్డికి తెలియదు. రామతీర్ధం ఘటనపై సీబీఐ విచారణ జరిపి నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

Leave a Reply