Suryaa.co.in

Telangana

రేవంత్ కూర్చున్న సీటు ఏంది? కూస్తున్న కూతలు ఏంది?

– పట్టు ఉంటే ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలి
– రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ
– పీసీసీ అధ్యక్షుడు డమ్మీ
.- బీ ఆర్ ఎస్ విప్ కె.పి.వివేకానంద
– రేవంత్ రెడ్డి ట్రిలియన్ లో ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పాలి
– తెలంగాణకు పట్టిన చీడపురుగు రేవంత్
– ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

హైదరాబాద్: నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్,కేటీఆర్ పై రేవంత్ రెడ్డి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. చావును కోరుకునే వ్యక్తి సీఎం పదవిలో ఉన్నారు. కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ రెడ్డి ఉపన్యాసం ఉండటం లేదు.

రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను గల్లీ లీడర్ మాట్లాడడు.రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ. రేవంత్ రెడ్డి భూతుల భూతం గా తయారయ్యారు. రేవంత్ రెడ్డికి నిజంగా పట్టు ఉంటే ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలి. ఆరు గ్యారెంటీలు,420 హామీలు రాష్ట్రంలో అమలు కావు.రేవంత్ రెడ్డి డైవర్షన్
పాలిటిక్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూర్చున్న సీటు ఏంది? కూస్తున్న కూతలు ఏంది?

రేవంత్ రెడ్డి ట్రాప్ లో బిఆర్ఎస్ పడదు. గల్లా పట్టి గ్యారంటీలు అమలు చేపిస్తాం. తెలంగాణ ఇమేజ్ ను రేవంత్ రెడ్డి నాశనం చేశారు. బీ ఆర్ ఎస్ ను రేవంత్ ఏదో అంటున్నారు. తెలంగాణలో ఉన్నది కామాంధుల కాంగ్రెస్ పార్టీ. పీసీసీ అంటే పిశాచి కాంగ్రెస్ కమిటీ యా ? సీఎంలు తప్పు చేస్తే గతంలో పీసీసీ అధ్యక్షులు సరిచేసేవారు.. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు డమ్మీ…రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నారు.

ట్రిలియన్ లో ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

లక్ష్మీనరసింహస్వామి నిన్న రేవంత్ రెడ్డితో నిజం చెప్పించాడు. నేను ప్రజల కోసం సీఎం కాలేదు పగ కోసం సీఎం అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యం పేరుతో అధికారంలోకి వచ్చి పగతో,కక్షతో పాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి సీఎంగా ఉండే అర్హత లేదు.

నేను సత్యాన్వేషి అని రాహుల్ గాంధీ అంటారు. రేవంత్ రెడ్డి మాత్రం పగతో,కసితో,కక్షతో సీఎం అయ్యాయని రేవంత్ రెడ్డి అంటారు.
సోనియాగాంధీని,మల్లిఖార్జున ఖర్గే,రాహుల్ గాంధీని ఎవరైనా ఏమైనా అంటే కాంగ్రెస్ కార్యకర్తలు భాధపడరా? కేసీఆర్ మానసికంగా గట్టివాడు. తెలంగాణ కోసం తిరిగి ప్రజల్లోకి వస్తారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని సరిచేయాలి. రేవంత్ రెడ్డికి సోనియాగాంధీపై, ప్రజలపై,కాంగ్రెస్కా ర్యకర్తలపై ప్రేమ లేదు.

రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీ పదవి,దోపిడీపై మాత్రమే ప్రేమ ఉంది. రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి, bరేవంత్ రెడ్డి రివేంజ్రె డ్డిగా మారారు. రేవంత్ రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదు. రేవంత్ రెడ్డి కర్నూల్ ఫ్యాక్షనిస్ట్ లాగా మాట్లాడుతున్నారు.
రేవంత్ రెడ్డి ఏ కారణంతో జైలుకి వెళ్లారో ప్రజలకు తెలియదా? చంద్రబాబు నాయుడు చెంచాగా మారి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని రేవంత్ రెడ్డి చూశారు. రేవంత్ రెడ్డి చేసిన పాపానికి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాలి. 50 లక్షలతో ఎమ్మెల్యేను కొంటూ జైలుకు వెళ్లడం తప్పు కాదా?

తెలంగాణలో ట్రిలియన్ ఎకానమీ అంటున్న రేవంత్ రెడ్డికి ట్రిలియన్ లో ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పాలి. ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో 579 కోట్ల లోటు బడ్జెట్ ఉంది.తెలంగాణకు పట్టిన చీడపురుగు రేవంత్ రెడ్డి. అందాల పోటీలను కామాంధుల చేతికి రేవంత్ రెడ్డి కట్టబెట్టారు
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నోటిఫికేషన్లతో ఇచ్చిన ఉద్యోగాలు 10వేలు మాత్రమే. నిన్న ఆలేరులో రేవంత్ రెడ్డి ఫ్యూడలిజం బయటపడింది. బీర్ల ఐలయ్యకు విప్ పదవి నేను ఇచ్చానని రేవంత్ రెడ్డి అన్నారు

నోరు తెరిస్తే అబద్దాలు: మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ..

రేవంత్ రెడ్డి నిన్న ఆలేరులో అబద్దాలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్దాలు. కేసీఆర్ 2015లోనే వై.టి.డి.ఏ ను ఏర్పాటు చేశారు. వై.టి.డి.ఏ గురించి తెలియకుండా రేవంత్ రెడ్డి మాట్లాడారు.

కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుండే గంధమళ్లకు నీళ్లు వస్తున్నాయి. 1 టీఎంసీ నీళ్లకు గంధమళ్ల రిజర్వాయర్ ను కుదించారు
గంధమళ్లలో ఎలాంటి ముంపు లేకుండా రిజర్వాయర్ ను కట్టాలని అనుకున్నాం. 2023లో యాదగిరి గుట్టలో మెడికల్ కాలేజీకి జీవో వచ్చింది.

సంవత్సరం క్రితం మెడికల్ కాలేజీని రేవంత్ రెడ్డి కొడంగల్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. 100 మెడికల్ సీట్లు ఉన్న కాలేజీని 50 సీట్లకు పరిమితం చేశారు యాదాద్రి అనే పేరు ఎప్పటినుంచో ఉంది.

 

LEAVE A RESPONSE