ఇప్పటంలో రోడ్డు విస్తరణ చేయమని ఎవరడిగారు?

-మీకు చేతనైతే రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చండి
– జనసేన సభకు భూములిచ్చారన్న కక్ష్యతోనే ఒక సామాజికవర్గం వారి ఇళ్లు కూల్చారు
– దాడులు చేయటం, రాళ్లేయటం రాజశేఖర్ రెడ్డి కుటుంబ పేటెంట్ హక్కు
– టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్

రాష్ట్రంలోని రోడ్లపై ఉన్న గుంతల్ని పూడ్చలేని వైసీపీ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో ఇళ్లు కూల్చడం దుర్మార్గమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. శనివారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…… ఇప్పటంలో 120 అడుగులు రోడ్దు విస్తరణ చేయమని ఎవరడిగారు? జనసేన సభకు భూములిచ్చారన్న కక్ష్యతోనే ఒక సామాజికవర్గం వారి ఇళ్లు కూల్చారు. రాష్ట్రంలో రోడ్ల దుస్తితి ముఖ్యమంత్రికి తెలీదా, గుంతల్లో పడి వైసీపీ కార్పోరేటర్ చనిపోయింది వాస్తవం కాదా? మీకు చేతనైనే రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చండి.

రాజదాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు విస్తరణ పనులు జరగకుండా కోర్టుకెళ్లిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మారుమూల గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చటం ఏంటి? నువ్వు ప్రజలకు మొహం చాటేయటం తప్ప నియోజకవర్గంలో చేసిన అభివృద్ది ఏంటి? కూల్చడం వైసీపీ ప్రభుత్వ పేటెంట్ హక్కులా భావిస్తున్నారు. అక్రమ కట్టడం అని ప్రజావేదిక కూల్చిన సీఎం, మూడున్నరేళ్లలో ఎన్ని అక్రమ కట్టడాలు కూల్చారు? ప్రజా వేదిక అక్రమ కట్టడం అయితే దానికి అనుమతిల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి కదా. మరి ఎందుకు తీసుకోలేదు? కక్ష్యతోనే ప్రజావేదిక కూల్చారు.

దాడులు చేయటం, రాళ్లు వేయించటం రాజశేఖర్ రెడ్డి కుటుంబ పేటెంట్ హక్కు. నాడు నంద్యాల సభలో ప్రధాని పీవీ నరసింహరావుపై రాజశేఖర్ రెడ్డి రాళ్లు వేయించారు. సీఎం పదవి కోసం హైదరాబాద్ లో వైయస్ మత ఘర్సణలు సృష్టించారని మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డే స్వయంగా చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడి అమరావతి పర్యటనలో చెప్పు, రాళ్లు వేయించారు, చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ కి మంత్రి పదవి ఇచ్చారు. అమరావతి రైతులపై రాళ్లు వేయించారు. నందిగామలో చంద్రబాబు నాయుడుపై జరిగిన రాళ్ల దాడిలో ఘటనలో పూలలో రాళ్లు ఉన్నాయని నిందితుల్ని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

రాళ్లు వేసినవారు స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుచరులు. వారి పోటోలతో సహా పోలీసులు ఫిర్యాదు చేశాం. కానీ పోలీసులు మాత్రం పక్కదారి పట్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడి విశాఖ పర్యటనలో కోడి గుడ్లతో దాడికి ప్రయత్నించారు. దాడులు, దౌర్జన్యాలు పులివెందుల సంసృతి, నచ్చని వాళ్ల మీద దాడులు, దౌర్జన్యం చేయటం వైసీపీకి దినచర్యగా మారింది. వైసీపీ నేతలు బూతులు తిట్టడం తప్ప విధాన పరమైన అంశాలు మాట్లాడలేరు. వైసీపీ అరాచక పాలనకు కాలం చెల్లింది, బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు.

Leave a Reply