Suryaa.co.in

Andhra Pradesh

ఇచ్చేది గోరంత… ప్రచారం కొండంత

• పెన్షన్ డబ్బు బినామీ కాంట్రాక్టర్లకు దోచి పెట్టే అధికారం జగన్ రెడ్డికి ఎవరిచ్చారు?
• ఏప్రిల్ 1వ తేదీనే అవ్వాతాతలకు పెన్షన్ అందించాలి
• సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పెన్షన్ పంపిణీకి ఏపీ సీఎస్ చర్యలు తీసుకోవాలి
• రేపు తెల్లవారుజామున పెన్షన్ ఇవ్వకపోతే ప్రజల తరపున ఉద్యమిస్తాం
– టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

ఒకటో తేదీనే అవ్వాతాతలకు పెన్షన్ అందేలా ఏపీ చీఫ్ సెక్రటరీ చర్యలు తీసుకోవాలి. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పింఛను పంపిణీ చేసేలా యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. దీనిపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలి. సీఎం జగన్ రెడ్డి స్వార్ధ రాజకీయాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలిసీ ఖజానాలో పెన్షన్ కు డబ్బులు ఉంచకుండా, బినామీలకు డబ్బులు ఇష్టారాజ్యంగా పంచిపెట్టారు. అడ్డగోలు నిర్ణయాల తీసుకుని వేల కోట్లు అస్మదీయులకు, వైసీపీలోని కొందరి నేతలకు ఊడ్చిపెట్టారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి సారి వృద్ధులకు పెన్షన్ ప్రవేశపెట్టారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వృద్ధులు తన చైతన్య రథం వెంట పరుగులు పెడుతుంటే చూసి అన్నగారు చలించిపోయావు. వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ మహానుభావుడు తీసుకున్న విప్లవాత్మకమైన ఈ నిర్ణయం లక్షలమందికి ఆసరాగా నిలిచింది. రూ. 10 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉన్నప్పటికీ రూ. 200 పెన్షన్ ఇచ్చారు.

ఆ రోజుల్లో ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొచ్చారు. చంద్రబాబు రూ. 200 పెన్షన్ ని రూ. 2000 చేశారు. వితంతువులు, డబ్బు కళాకారులు సహా అన్ని వర్గాలకు పించను అందించారు. కానీ నేడు జగన్ రెడ్డి పెన్షన్ తానే కనిపెట్టినప్పుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు.

మాట తప్పి మడమ తిప్పాడు:
రూ. 3000 పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక విడతల వారీగా ఇస్తున్నాడు. 2019 జూన్ నుంచే రూ. 3 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వలేదో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి చేసిన మోసం వల్ల అవ్వాతాతలకు రూ. లక్షా 80 వేల నష్టం వాటిల్లింది. సాక్షిలో వందల కోట్ల ప్రజాధనంతో ప్రకటనలు ఇస్తూ అసత్య ప్రచారం చేసుకుంటున్నాడు. రేపు టీడీపీ,బీజేపీ, జననేన కూటమి అధికారంలోకి రాగానే రూ. 4000 పెన్షన్ ఇస్తానని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. పెడుతున్న ఇబ్బందులు చాలవన్నట్టు పెన్షనర్ల వయో పరిమితి తగ్గించి జగన్ రెడ్డి మోసం చేశాడు.

చంద్రబాబు గడిచిన ఐదేళ్లలో 20 లక్షల పెన్షన్లు పెంచితే జగన్ రెడ్డి ఈ ఐదేళ్లలో 10 లక్షలు కూడా పెంచలేదు. రూ7 లక్షల కోట్ల బడ్జెట్ లో చంద్రబాబు 20 లక్షల పెన్షన్లు పెంచి చూపిస్తే నేడు 12 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ 10 లక్షల లోపే ఎందుకు పరిమితం అయ్యారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. పెన్షన్ ఇచ్చే సమయానికి అవ్వాతాతలు అందుబాటులో లేకపోతే ఆ డబ్బు కొట్టేసిన ఘనత జగన్ రెడ్డిది.

ఒక పెన్షన్ , ఒక రేషన్ కార్డు సాకుతో పేదలను జగన్ రెడ్డి నిండా ముంచుతున్నాడు. కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు…టీడీపీపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీల ద్వారా తప్పుడు మెసేజ్ లు ఇస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం. కీలక స్థానాల్లో ఉన్న అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

బడుగులకు అండగా తెలుగుదేశం:
ఒంటరి మహిళలు, భర్త నుంచి విడిపోయిన వారికి టీడీపీ హయాంలో వయో పరిమితి తగ్గించి పెన్షన్ అందించగా జగన్ రెడ్డి ఆ వయసును 50 ఏళ్లకు పెంచి పెన్షన్ అందకుండా చేశాడు. నాడు దివ్యాంగులకు 79 పర్సంట్ వైకల్యం ఉంటే పెన్షన్ అందించాం. కానీ నేడు దాన్నీ తగ్గించి పెన్షన్ ఎగ్గొట్టాడు. హిజ్రాలకు చంద్రబాబు గారు రూ. 3 వేల వరకూ పెన్షన్ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి ఏం చేశాడు?

2019లో టీడీపీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 8 లక్షల 60 వేల పెన్షన్లు ఇచ్చాం. దివ్యాంగులకు రూ. 3 వేల వరకూ ఇచ్చాము. జగన్ రెడ్డి మాత్రం ప్రచారానికే పరిమితమయ్యాడు. కిడ్నీ బాధితులకు రూ. 5 పెన్షన్ ఇచ్చాం. గిరిజనులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చాం. 2015 , ఏప్రిల్ 18న జీవో 39 ద్వారా దేశంలోనే మొదటిసారి ట్రాన్స్ జెండర్ లకు పెన్షన్ ఇచ్చాం. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చే నాటికి పెన్షన్ ఖర్చు రూ. 400 కోట్లు కాగా చంద్రబాబు గారు దాన్ని రూ. 1384 కోట్లకు తీసుకెళ్లారు.

ఈ అసమర్థ జగన్ రెడ్డి మీనమేషాలు లెక్కపెడుతున్నాడు. ఖజానాలో డబ్బులేదని మాపై బురద జల్లుతున్నాడు. ప్రజల కోసం పనిచేస్తున్న సిటిజన్ ఫర్ డెమక్రసీ మీద కూడా విషం జల్లుతున్నారు. ప్రజల నుంచి రూ.8 లక్షల కోట్లు దోచేసిన జగన్ రెడ్డి వారిని రోడ్డున పడేశాడు. సమయానికి పెన్షన్ ఇవ్వకుండా అవ్వాతాతలను ఇబ్బందులు పెడుతున్నాడు. రాష్ట్రంలో 13 వేల 500 మంది పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉన్నారు. లక్షలాదిమంది ప్రభుత్వఉద్యోగులు ఉన్నారు. చీఫ్ సెక్రటరీ వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఏప్రిల్ 1 తెల్లవారుజామునే పెన్షన్ అందించాలి.

ఈ ఐదేళ్లలో పెన్షన్ తీసుకునే వారిలో 7 లక్షలమందికి కోత పెట్టిన జగన్ రెడ్డికి వారి ఉసురు తగులుతుంది. జగన్ రెడ్డి మాటలు నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దని వాలంటీర్లకు విన్నవిస్తున్నాము. తను ప్రయాణించే మార్గంలో కొన్ని గ్రామాలనే ఎంపిక చేసుకుని ఎక్కడైతే సమావేశాలు పెడుతూ డీపీటీ, నాన్ డీపీటీ ద్వారా అన్ని పనులు చేసినట్టు అసత్య ప్రచారాలు చేస్తున్నాడు.

జగన్ రెడ్డికి దమ్మూ ధైర్యం ఉంటే నువ్వు చెప్పే రెండు గ్రామాలతో పాటు మిగిలిన 12, 13 గ్రామాలకు నవరత్నాల ద్వారా ఎంత డబ్బు పడిందో బయటపెట్టాలి. అప్పుడు నువ్వు నొక్కే బటన్ నొక్కుడు గుట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 1న పెన్షన్ పడకపోతే ఉద్యమబాట పట్టి ప్రజల పక్షాన పోరాడతాం.

LEAVE A RESPONSE