Suryaa.co.in

Andhra Pradesh

రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు పోరాటం

– ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిలా రెడ్డి
– ఏపీసీసీ చీఫ్ తో పాటు ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కేవీపీ రామచంద్రరావు,రఘువీరా రెడ్డి,శైలజానాథ్,తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు
– వైఎస్సార్ అభిమానులతో కిక్కిరిసిన వైఎస్సార్ ఘాట్ పరిసర ప్రాంతాలు
– ఘాట్ వద్ద ఏపీసీసీ చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి అహ్మదుల్లా

కడప: ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి ఏమన్నారంటే.. రేపు ఉదయం విజయవాడ లో ఏపీసీసీ గా భాద్యతలు తీసుకుంటున్న. ఇవ్వాళ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చా.వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరా. వైఎస్సార్ కి కాంగ్రెస్ పార్టీ, పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానం. సిద్ధాంతాల కోసం వైఎస్సార్ ఎంత దూరం అయినా వెళ్ళే వాడు.

ఇవ్వాళ దేశంలో సెక్యులరిజం అనే పదానికి, ఫ్యూడలిజం అనే పదాలకు అర్థం లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి. భారత దేశానికి మళ్ళీ మంచి జరగాలి. వైఎస్సార్ ఆశయాలు అన్ని సిద్ధించాలి. వైఎస్సార్ నమ్మిన సిద్ధాంతం కోసం నేను పార్టీలో ఆఖరి వరకు నిలబడతా. వైఎస్సార్ కోరుకున్నట్లు రాహుల్ గాంధీ ని ప్రధాని చేసే వరకు పోరాటం ఆగదు.

LEAVE A RESPONSE