– ట్రంప్
క్రిప్టో కరెన్సీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దేశాన్ని ప్రపంచ క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మారుస్తానని, క్రిప్టో రిజర్వ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో, బిట్ కాయిన్ ధర రూ. 80 లక్షలు దాటేసింది. మార్చి 7న ట్రంప్ క్రిప్టో సమ్మిట్ ను నిర్వహించ నుండగా.. ఈ లోపే ప్రకటన చేయడం గమనార్హం. క్రిప్టో కాయిన్స్ ఎక్ఆర్పీ, సోలానా, కార్డానో, ఈథర్ ధరలు భారీగా పెరిగాయి.