Home » కాపు కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు కృషి చేస్తా

కాపు కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు కృషి చేస్తా

– శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య , ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్

వంగవీటి మోహన రంగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి అని,కోట్ల మంది ప్రజల అభిమానం రంగా కే సొంతమని,విజయవాడ పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురామ్ ,జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} అన్నారు.

గురువారం స్వర్గీయ వంగవీటి మోహన రంగా 77వ జయంతి పురస్కరించుకుని కాపు వారధి టీం ఆధ్వర్యంలో మరియు,అఖిలభారత కాపు సమైక్య ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్ లో ఉన్న వంగవీటి మోహన రంగా విగ్రహానికి స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో,కౌన్సిలర్స్ సభ్యులతో కలిసి నెట్టెం రఘురామ్ , శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సందర్భంగా కాపు లు కాపు కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేయాలని అడుగగా వెంటనే స్పందించి కాపు కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply