గుంటూరు డిసెంబర్ 5: ప్రముఖ రచయిత , గుంటూరు మున్సిపాలిటీ విశ్రాంత మేనేజర్ జొన్నలగడ్డ చిరంజీవి శాస్త్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. గుంటూరు, నెల్లూరు మంగళగిరి, జగ్గయ్యపేట, అనకాపల్లి, నరసరావుపేట మునిసిపాలిటీలలో వివిధ హోదాల్లో పని చేశారు. ఆయనకు నలుగురు పిల్లలు. ముగ్గురు మగపిల్లలు ,ఒకరు ఆడపిల్ల ఉన్నారు. జొన్నలగడ్డ చిరంజీవి శాస్త్రి పార్థివ దేహానికి కొరిటపాడు లోని మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగులు , ఉద్యోగ సంఘ నేతలు , హీరో ప్రభాస్ మేనల్లుడు సత్యనారాయణ మూర్తి, మేనేజర్ రామకృష్ణ , కన్నా విద్యాసంస్థల చైర్మన్ కన్నా మాస్టారు, మునిసిపల్ ఉద్యోగ సంఘాలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి శాస్త్రి ఆత్మ శాంతించాలని ప్రార్ధించారు.
Devotional
రావి చెట్టు – వేప చెట్టును కలిపి ఎందుకు పూజిస్తారు?
మన పురాణాలు, సంస్కృతి, సంప్రదాయాలన్నీ ప్రకృతి ప్రాధాన్యతను ప్రతిఫలించేలా ఉండటం విశేషం. వాటిలో ముఖ్యంగా రెండు చెట్లు – రావి చెట్టు ( మరియు వేప చెట్టు – భారతీయ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనవి. వీటిని కలిపి పూజించడం ఒక ప్రాచీన ఆచారం మాత్రమే కాదు, గొప్ప ఆధ్యాత్మికత, వైజ్ఞానికత మరియు ఆరోగ్య రహస్యాలను కూడా…
ఈశ్వరుడి లీలా అపారమైనది
మనిషి శరీరంలోని వేళ్లపై ఉన్న చర్మం మీద రేఖలు రూపుదిద్దుకోవడం, శిశువు తల్లిగర్భంలో సుమారు నాలుగు నెలల వయసు ఉన్నప్పుడే ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఈ రేఖలు మాంసంపై జాలంలా…అంటే వలయంలా ఏర్పడతాయి. ఈ రేఖల ఏర్పాటుకు సమాచారం డిఎన్ఎ ద్వారా లభిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రేఖలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…