పరదాల మాటున తిరిగే పిరికిపంద జగన్

-తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి మితిమీరి ప్రవర్తిస్తు్న్నాడు
-వ్యవస్థల్ని కాపాడాల్సిన వైసీపీ నాయకులు నేరస్థులను కాపాడుతున్నారు
– మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

పరదాల మాటున తిరిగే పిరికిపంద జగన్ అని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి మితిమీరి ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్, కొన్ని పత్రికలు, న్యూస్ ఛానళ్లపై చేసిన వ్యాఖ్యలు అమానవీయం. జాకీ కంపెనీ వైసీపీ నాయకులవల్లే పోయిందంటే తప్పా?, ఇంత కడుపు మంట ఎందుకు? అది వారిని బాధించినట్లు ఎలా అవుతుంది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి జెడ్ ప్లస్ కేటగిరి లో ఉన్న చంద్రబాబునాయుడును వైఎస్ చెప్పివుంటే మొద్దుశీను చంపేవాడని చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడం అతని ఫ్యాక్షనిజాన్ని తెలియజేస్తోంది. ఫ్యాక్షనిజం మొదలుపెడితే లోకేశ్ ని టార్గెట్ చేస్తామనడం ఎంత ధైర్యం? వీరు మాట్లాడుతున్న భాష జుగుప్సాకరంగా ఉంది.

పత్రికల్లో ఒకటి, రెండు సార్లు వస్తేనే ఇంతగా బాధపడుతున్న వైసీపీ నాయకులు.. అవినీతి పుత్రిక సాక్షి చెత్త పత్రికలో 10 సంవత్సరాలుగా చంద్రబాబు, లోకేశ్, తెలుగుదేశంపై ఇష్టారాజ్యంగా రాస్తూ వస్తున్నారు, మాకెంత బాధ ఉంటుందో ఆలోచించాలి. పత్రికల్లో వచ్చినదానిపై వివరణ ఇవ్వాలి.. వాళ్లను చంపుతాం, వీళ్లను చంపుతాం అని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు కూడా చంపండని చెప్పివుంటే పాదయాత్రలు చేసేవారా? అధికారంలోకి వచ్చేవారా? నేడు మీరు ఇలా మాట్లడగలిగేవారా? చంద్రబాబునాయుడుకు మీలాంటి మనస్తత్వం లేదు. అవినీతితో వేల కోట్లు సంపాదించుకొని అహంకారంతో మదమెక్కి మాట్లాడుతున్నారు. ఉగ్ర నరసింహుడి రూపంలో లోకేశ్ కనపడుతున్నాడని ఆయన పై మాట్లాడుతున్నారంటే అది వైసీపీ నాయకుల ప్యాంట్లు తడవడం, భయంతోనే. సొంత బాబాయిని చంపి గొడ్డలి పోటును గుండె పోటుగా చిత్రీకరించారు. 2003లో అలిపిరి సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు మీద నక్సల్స్ 23 క్లైమోర్ మైన్స్ పేల్చారు. వెనకుండి చేయించింది ఎర్రచందనం స్మగ్లర్ ఎర్రగంగిరెడ్డి కాదా? ఆనాడు 20 అడుగుల ఎత్తుకు చంద్రబాబు ఉన్న కారు ఎగిరి కిందపడ్డా చంద్రబాబునాయుడుకు ఏమీ కాలేదు.

వైసీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయి, హత్యా రాజకీయాలలో నిండా మునిగిపోయి వున్నారు. పేటీయం బ్యాచ్ తో తాడేపల్లి స్క్రిప్టును చదివిస్తున్నారు. భాష సరైందికాదు భావం సరైంది అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి మాట్లాడారు. 1997లో హైదరాబాద్ పోలీసులు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని అరెస్టు చేశారు. పరిశ్రమలు తరలడానికి వైసీపీ నాయకుల నిర్వాకం, బెదిరింపులే కారణం. పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా వుంది. వైసీపీ నాయకులకు, ప్రభుత్వంలోని పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు స్టేషన్ లోనే చంపుతామని బెదిరిస్తున్నారు. వారి వైఖరిపై డీజీపీ సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో టీడీపీ నాయకులుకూడ వైసీపీలానే దాడులు చేయాలని సంకేతాలిచ్చినట్లుంది. వ్యవస్థల్ని కాపాడాల్సిన వైసీపీ నాయకులు నేరస్థులను కాపాడుతున్నారు. బరితెగించి వ్యవహరిస్తే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. మైనింగ్, ఇసుక, లిక్కర్ లలో దోపిడీ చేసి రాష్ట్రాన్నిదోచుకొని సర్వనాశనం చేశారు. వైసీపీ కంపెనీలలో తయారు చేసే మద్యం తాగి వేల మంది చనిపోయారు. అనేకమంది కాళ్లు చేతులు పనిచేయక మంచాన పడ్డారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. రెండు లక్షల కోట్లకు లెక్కలు లేవు. రాష్ట్రాన్ని దివాలా తీయించారు. రాష్ట్రంలో సంక్షేమం లేదు. ఏవర్గమూ సంతోషంగా లేదు.

రాష్ట్రాన్ని దిక్కు, దివాణం లేకుండా చేశారు. ఒకసారి అత్యాచారం జరిగితేనే ఇంతటి గోల చేస్తున్నారని మంత్రి రోజా చెప్పడం చాలా దుర్మార్గం. తెలుగుదేశం హయాంలో ఏ చిన్న సంఘటన జరిగిన పెద్దగా గోల చేసిన మీరు ఆనాటి సంఘటనలు గుర్తు చేసుకోవాలి. పై స్థాయిలో ఉన్న చంద్రబాబు, లోకేశ్ లపై మాట్లాడితే కింది స్థాయి నాయకులు భయపడతారని అనుకుంటున్నారు. నోరు పారేసుకునే చెత్త బ్యాచ్ చంద్రబాబు, లోకేశ్ లను ఏమీ చేయలేరని గుర్తు పెట్టుకోవాలి. ప్రజలు వైసీపీ పట్ల కోపంగా వున్నారన్న సంగతి వైసీపీ నాయకులకు తెలుసు. సర్వేల్లో కూడా తేలింది. అందుకే వ్యవస్థల్ని మార్చుకుంటున్నారు, ఏం మార్చుకున్నా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అసభ్యంగా మాట్లాడే ఊరకుక్కల్ని ప్రజలు తరుముతారు. మీకు ఇవే చివరి ఎన్నికలు, జగన్ కు చివరి సీఎం పదవి ఇదే. 170 నియోజకవర్గాల్లో టీడీపీ, 170 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయమని చెప్పడానికి మీరెవరు? మా ఇష్టం. మేం కలిసి పోటీ చేస్తే మీకు డిపాజిట్లు కూడా రావని భయపడుతున్నారు. ఎలా పోటీ చేయాలో మాకు బాగా తెలుసు, మిమ్మల్ని ఎలా పాతర వేయాలో కూడా మాకు బాగా తెలుసు. ప్రజలు కూడా మిమ్మల్ని సాగనంపడానికి సిద్ధంగా వున్నారు. వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలే బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.

Leave a Reply