సంక్రాంతిని జూద,అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చిన ఘనత వైసీపీదే

-వైసీపీ నేతల తప్పుడు పనుల్ని సమర్ధిoచడానికి పేర్ని నానికి సిగ్గనిపించడం లేదా?
-మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప

సంక్రాంతి సoబరాల్లో వైసీపీ నేతల అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి తెచ్చిన మీడియా పై మంత్రి పేర్ని నాని అక్కసు వెళ్లగక్కుతున్నారు. గతoలో జరిగే ఉత్సవాలే ఏ ఏడాది జరిగాయనడం ఆయన దివాలుకోరుతనానికి నిదర్శనం. గతంలో ఏ సంక్రాంతి కైనా రాష్ట్రంలో క్యాసినో నిర్వహించారా? టీడీపీ హయాంలో సంక్రాంతి అంటే సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించాo. కానీ నేడు వైసీపీ హయాంలో సంక్రాంతి ని జూద క్రీడలు, అసాoఘిక కార్యకపాలకు వేదిక మార్చి తెలుగు, సంస్కృతి, సంప్రదాయాలను మంట గలిపారు.రాష్ట్రంలో ప్రతి చోట వైసీపీ నేతల ఆధ్వర్యంలో క్యాసినో, గుండాట, పేకాట, అమ్మాయిలతో అస్లిల నృత్యా లు నిర్వాహించడమే కాక వాటిని సమర్ధించుకోవడానికి మంత్రి పేర్ని నానికి సిగ్గనిపించడం లేదా? టీడీపీ అభివృద్ధికి నిలయంగా ఉన్న ఆంద్రప్రదేశ్ వైసీపీ పాలనలో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మార్చి రాష్ట్ర ప్రతిష్ట మంట గలుపుతున్నారు.

Leave a Reply