రాసి పెట్టుకోండి… వైసీపీ ఖేల్ ఖతం, దుకాణ్ బంద్

– చంద్రబాబు నాయుడు ప్రకటించిన మ్యానిఫెస్టోతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యింది
– తమ శాఖలు సక్రమంగా వెలగబెట్టలేని మంత్రులు చంద్రబాబు నాయుడిపై పడి ఏడ్వటం సిగ్గుచేటు
– టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మ్యానిఫెస్టోతో వైసీపీ నేతలు మైండ్ బ్లాక్ అయ్యి గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేష్ పై పిచ్చి వాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. మంగళవారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ….. చంద్రబాబు నాయుడు ప్రకటించిన మ్యానిఫెస్టోతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. మాయల పకీర్ కారుమూరి నాగేశ్వరరావు తన పని సక్రమంగా చేయకుండా కారుకూతలు కూస్తున్నారు. మంత్రిగా అతను చేయాల్సిన పనులేంటి?

రైతుల నుంచి పంటకొనటం, మిల్లర్ల నుంచి రైతులని కాపాడడం, రేషన్ బియ్యం సక్రమంగా పంపిణి చేయటం కానీ ఇందులో ఏ ఒక్కటైనా సక్రమంగా చేశారా? టిష్యూ పేపర్ వైసీపీ మ్యానిపెస్టోనే, ప్రజలు వైసీపీ మ్యానిపెస్టోను ఏనాడో చించేశారు. అంబటి రాంబాబు మంత్రిగా ఏం చేశారు? పోలవరం డీపీఆర్ ఆమోదించటం చేతకాదు, నిర్వాసితులకు ఇళ్లు కట్టలేదు, పరిహారం ఇచ్చే దమ్ము లేదు కానీ సిగ్గులేకుండా చంద్రబాబు గురించి మాట్లాడుతారా?

మృతుల కుటుంబాలదగ్గర వాటాలు అడిగిన నీచచరిత్ర అంబటిది, మంత్రిగా ఏనాడైనా ఏ ప్రాజెక్టు దగ్గరకైనా వెళ్లి సమీక్ష చేశారా? పోలవరంకు ఎన్ని గేట్లుంటాయో తెలుసా? సుజల స్రవంతి అడ్రస్ ఎక్కడుందో ఆయనకు తెలుసా? దేవుడి మాన్యాలు కాపాడలేని దద్దమ్మ కొట్టు సత్యనారాయణకి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఉందా? అమరావతిలొ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చంద్రన్న కేటాయించిన భూమిని కుదించిన వ్యక్తివి నువ్వు నీతులు చెప్పేది? సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 64 వేల కోట్లు ఖర్చు చేసింది చంద్రన్న.

పోలవరం 70 శాతం పూర్తి చేసి, రూ16 వేల కోట్ల లోటు బడ్జెట్ లో సైతం రూ. 3 లక్షల కోట్ల సంక్షేమ పధకాలు అందించిన ఘనత చంద్రన్నదే. పేదల్ని ధనవంతుల్ని చేస్తామంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడు కట్టిన ఇళ్లను పేదలకు పంచకుండా పాడుపెట్టిన నీచుడు జోగి రమేష్. ఇబ్రహీం పట్నం పవర్ ప్లాంట్ బూడిదను అమ్ముకోవటం తప్ప మంత్రిగా ఆయన చేసిందేంటి? జగన్ బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ. 75 వేల కోట్లు దారి మళ్లించారు, రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించి 16800 బీసీలను స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు కాకుండా ద్రోహం చేశారు.

నాలుగేళ్లలో 26 మంది బీసీలను పొట్టన పెట్టుకున్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నోరెత్తలేని జోగి రమేష్ మా మ్యానిఫెస్టో గురించి మాట్లాడటం సిగ్గుచేటు. మంత్రి కాకాణికి కోర్టు పైళ్లు దొంగతనం చేయటంపై ఉన్న అవగాహన అగ్రకల్చర్ మీద లేదు. రైతుల నుంచి ఎంత ధాన్యం కొన్నారో, రైతులకు ఏం ఒరగబెట్టారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? పెద్దిరెడ్డి ముందు కుర్చీలో కూర్చోలేని డిప్యూటి సీఎం నారాయణ కూడా చంద్రబాబు విమర్శలు చేయటం హాస్యాస్పదం. కల్తీ మద్యంతో మహిళల తాళిబొట్లు తెగుతుంటే మాట్లాడలేని వ్యక్తి సాక్షి స్పిప్ట్ చదువుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో మేరుగ నాగార్జునకు వేమూరులో డిఫాజిట్లు కూడా రావు, అందుకే ఎమ్మెల్సీ సీటు కోసం చంద్రన్నపై ఇప్పటి నుంచే ఆరోపణలు చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ మంత్రిగా అట్లర్ ప్లాప్ నువ్వు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా 5.13 లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 10 లక్షల ఉద్యోగాలిచ్చారని వైసీపీ మంత్రే శాసనమండలిలో చెప్పింది మర్చిపోయారా?

కొడాలి నాని కాపుల్ని, ఎస్సీ,బీసీ అన్ని వర్గాల్ని బూతుల్ని తిడుతున్నారు. ఒక్క చాన్స్ పేరుతో ప్రజల్ని కోలుకోలేని చాన్స్ లేకుండా చేసిన వ్యక్తి జగన్ . సంపద సృష్టించి సంపద పంచి సంక్షేమ పధకాలు ఎలా ఇవ్వాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మా మ్యానిఫెస్టో వెబ్ సైట్ లో లేదంటున్నారు, మా మ్యానిఫెస్టో పేద ప్రజల గుండెల్లో ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు.

మా సభలకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు, మహానాడు విజయవంతమైంది, యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. వైసీపీకి కాలం చెల్లింది, రాసి పెట్టుకోండి వైసీపీ ఖేల్ ఖతం, దుకాణ్ బంద్ అని పంచుమర్తి అనురాధ హెచ్చరించారు.

Leave a Reply