వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి

-జగన్ రెడ్డి సేవలో ఉన్న మంత్రి మేరుగ నాగార్జున తన పుట్టుక మర్చిపోయి మాట్లాడుతున్నాడు
– సొంత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యుడిని గౌరవించలేని వ్యక్తి సంక్షేమశాఖ మంత్రిగా కొనసాగడం దురదృష్టకరం
-తల్లులను, మహిళలను కించపరిచేలా ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు
– టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు

శాసనసభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సిన సాంఘిక సంక్షేమ శాఖామంత్రి విచక్షణ కోల్పోయి మాట్లాడటం సిగ్గుచేటు. వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున ఏపీ స్టడీ సర్కిళ్లపై సమాధానం చెప్పలేక సొంత సామాజిక వర్గానికి చెందిన కొండేపి శాసన సభ్యుడు బాలవీరాంజనేయ స్వామిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటం క్షమించరాని నేరం. మేరుగ నాగార్జున ముఖ్యమంత్రి సేవలో తరిస్తూ అధికార మదంతో కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు.

సి.ఎం ను మెప్పించడానికి సాటి దళిత నాయకుడిని పట్టుకుని దళితుడికే పుట్టావా అని దాడి చేయడం దళిత తల్లులను అవమానించడమే. వైసీపీ నాయకులకు, మంత్రులకు విచక్షణ కోల్పోయి తల్లులను, స్ట్రీలను అవమానించడం వారసత్వంగా వస్తున్నట్లు ఉంది. గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా మా అధినేత చంద్రబాబు నాయుడి మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. ఇదే వారసత్వం వైసీపీ మంత్రులు అందిపుచ్చుకున్నట్లు ఉన్నారు.

కొడాలి నాని మొదలుకుని..వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గోరంట్ల మాధవ్, దువ్వాడ శ్రీనివాస్ లాంటి అనేక మంది వైసీపీ నేతలు స్ట్రీలను, తల్లులను అవమానించేలా మాట్లాడారు. ఇలాంటి వాళ్లకు సిఎం జగన్ రెడ్డి పూర్తి మద్దత్తు పలకడం ఆయన విచక్షణకే వదిలేస్తున్నాం. నిండుసభలో సాటి దళిత ఎమ్మెల్యే తల్లిని అవమానించేలా మాట్లాడిన మంత్రి మేరుగ నాగార్జునను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దళిత జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని. తల్లులను, మహిళలను కించపరిచేలా ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు. చిత్తశుద్ది ఉంటే సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా ఏపీ స్టడీ సర్కిళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి.

Leave a Reply