Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి లోకేష్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు

– దిశా చట్టం ఉంటే గత 5 ఏళ్లలో మహిళలపై ఎందుకు అఘాయిత్యాలు జరిగాయి?
– జగన్‌కు మంత్రి శ్రీబాల వీరాంజనేయస్వామి సూటిప్రశ్న

అమరావతి: ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా జగన్ గుణపాఠం నేర్చుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ తాడేపల్లి, బెంగుళూరు ప్యాలెస్ ల్లో తిరుగుతూ మంత్రి నారా లోకేష్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారు. దిశా లేని చట్టాన్ని తీసుకొచ్చి దిశా చట్టమని జగన్ రెడ్డి మాట్లాడం హాస్యాస్పదంగా ఉంది. గత ఐదేళ్లు ఆ చట్టానికి కేంద్రం నుంచి ఎందుకు అమోదం పొందలేదో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆ చట్టం ఉంటే రాష్ట్రంలో మహిళలపై 2 లక్షల ఆఘాయిత్యాలు ఎందుకు జరిగాయి?

ధనదాహానికి ఆస్తికోసం నీ తల్లి, చెల్లిపై కోర్టులో కేసు వేసిన నువ్వా మహిళల రక్షణ గురించి మాట్లాడేది? లోకేష్ మంగళగిరిలో పోటీ చేసి 90వేల ఓటర్ల మోజార్టీపైగా గెలిచారు. అతి తక్కువ సమయంలోనే 30 వేల ఉద్యోగాలు రాష్ట్రానికి తీసుకొచ్చారు. విద్యాశాఖ మంత్రిగా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. లోకేశ్ పై సాక్షిలో తప్పుడు రాతలు రాసినందుకు ఇవాళ కోర్టుమెట్లెక్కి తిరుగుతున్నా బుద్ధి రాలేదా? నీ జే ట్యాక్స్ వల్ల రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయాయి.. గుర్ల పర్యటనలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని విమర్శించారు. అసలు ఈ పాపం నీది కాదా జగన్ రెడ్డి..?

పంచాయతీ నిధులు రూ.13వేల కోట్లు దారి మళ్లించావు. అలాగే జలజీవన్ మీషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నిధులు దారి మళ్లించి రాష్ట్ర ప్రజలకు చుక్కనీరు ఇవ్వకుండా కలుషిత నీళ్లు తాగాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది జగన్ రెడ్డి కాదా..? మా ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోంది. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షనాయకుడికి తనకు తానే ప్రకటించుకున్నావు అని దుమ్మెత్తిపోశారు. గత ఐదేళ్ల నీ పాలనలో పరదాలు కట్టుకొని తిరిగావు.. కూటమి పాలనలో స్వేచ్ఛగా తిరుగుతున్నావు.. ఇది మంచి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వంపై బురద పోసే ప్రయత్నం చేస్తున్నారు. గత ఐదేళ్లు నీ పక్కన ఉన్న మీ పార్టీ నేతలే సంక్షేమం మాటున సంక్షోభం సృష్టించావని మాట్లాడుతున్నారు. దీనికి ఏం సమాధానం చెబుతావని మంత్రి బాల వీరాంజనేయస్వామి నిలదీశారు.

LEAVE A RESPONSE