100మందితో వచ్చి సినిమా స్టైల్లో యువతిని కిడ్నాప్ |

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన కిడ్నాప్ గ్యాంగ్ నానా బీభత్సం చేశారు. 100మంది ఒక్కసారి యువతి ఇంటిపై దాడి చేసి ఎత్తుకుపోయారు.అడ్డువచ్చినవారిపై దాడికి తెగబడ్డారు. యువతిని పరహరిస్తున్న సమయంలో తల్లిదండ్రులు అడ్డుకున్నారు. వారిని కొట్టి యువతిని తీసుకెళ్లిపోయారు కిడ్నాప్ గ్యాంగ్.

యువతి తల్లిదండ్రులు గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కలవారు వచ్చి గ్యాంగ్ ను అడ్డుకునేందుకు యత్నించగా వారిపై కూడా దాడి చేసి యువతిని తీసుకెళ్లిపోయారు. అచ్చు సినిమా స్టైల్లో జరిగిన ఈ కిడ్నాప్ ఘటన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కిడ్నాప్ గ్యాంగ్ యువతి ఇంటిలో విధ్వంసం చేశారు. కనిపించిన వస్తువులను ధ్వంసం చేశారు. కార్లను కూడా ధ్వంసం చేశారు.ఈ కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ కిడ్నాప్ పై యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు ఏసీపీ ఉమామహేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకున్నారు. యువతి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు.కిడ్నాప్ చేసింది మిస్టర్ టి టైమ్ ఓనర్ నవీన్ రెడ్డి అనే వ్యక్తి అని యువతి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో నవీన్ రెడ్డి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాగా కిడ్నాప్ కు గురి అయిన యువతి ముచ్చర్ల వైశాలి.డాక్టర్ చదవుతోంది. వైశాలిని నవీన్ రెడ్డి ప్రేమించాడు. ఈక్రమంలో వైశాలికి తల్లిదండ్రులు పెళ్లి నిశ్చించారు. వారి ఇంటిలో పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయి. పెళ్లికి చుట్టాలు కూడా వచ్చారు. పెళ్లి సందడితో ఇల్లంతా సందడి సందడిగా ఉంది. ఈక్రమంలో నవీన్ రెడ్డి సినిమా స్టైల్లో 100మంది గ్యాంగ్ తో వైశాలి ఇంటికి వచ్చాడు.

వైశాలిని తీసుకెళ్లటానికి యత్నిస్తుండగా ఇంట్లో ఉన్న బంధువులు, తల్లిదండ్రులు వారిని అడ్డుకున్నారు. దీంతో సదరు గ్యాంగ్ వారిపై దాడి చేశారు. ఇంట్లో వస్తువుల్ని..ఇంటి బయట ఉన్న కారుని ధ్వంసం చేశారు. దౌర్జన్యంగా వ్యవహరిస్తు వైశాలిని ఎత్తుకుపోయారు.

కాగా..మరి వైశాలికి ఇష్టం ఉండే వెళ్లిందా? లేక బలవంతంగా తీసుకెళ్లారా? అనే విషయం తెలియాల్సి ఉంది. వైశాలి ఆచూకీ కోసం ఏసీపీ ఉమామహేశ్వర రావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ పరిసరాల్లో ఉండే సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. వైశాలి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు బృందాలు.

Leave a Reply