వరుసగా నాలుగో ఏడాది…వైఎస్సార్‌ వాహన మిత్ర

– స్వయం ఉపాధిని అత్యధికంగా ప్రోత్సహిస్తున్న రవాణా రంగానికి ఊతమిస్తూ, డ్రైవరన్నలకు అండగా…వైఎస్సార్‌ వాహన మిత్ర
– 2,61,516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 261.52 కోట్ల ఆర్ధిక సాయం
– నేడు (15.07.2022) విశాఖపట్నంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

దేశంలో ఎక్కడా లేని విధంగా, సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు తమ వాహన అవసరాల కోసం వారికి అండగా ఉంటూ, గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆ శ్రమ జీవులకు తోడుగా నిలుస్తూ…ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేల ఆర్ధిక సాయం అందిస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.
వైఎస్సార్‌ వాహన మిత్ర క్రింద ఇప్పుడు అందిస్తున్న రూ. 261.52 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,026 కోట్లు.
ఒక్కొక్క డ్రైవర్‌కు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు అందించిన సాయం అక్షరాలా రూ. 40 వేలు.

వైఎస్సార్‌ వాహన మిత్ర క్రింద ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం
2019 – 20 సంవత్సరంలో 2,36,343 మంది లబ్ధిదారులకు రూ. 236.34 కోట్లు, 2020 – 21 సంవత్సరంలో 2,73,476 మంది లబ్ధిదారులకు రూ. 273.47 కోట్లు, 2021 – 22 సంవత్సరంలో 2,54,646 మంది లబ్ధిదారులకు రూ. 254.64 కోట్లు, 2022 – 23 సంవత్సరంలో 2,61,520 మంది లబ్ధిదారులకు రూ. 261.52 కోట్లు…ఇలా మొత్తం కలిపి రూ. 1,025.97 కోట్లు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.

2022 – 23 సంవత్సరానికి లబ్ధిదారుల వివరాలు (వర్గాల వారీగా)
ఎస్సీ లబ్ధిదారుల సంఖ్య – 63,594, ఎస్టీలు – 10,472, బీసీలు – 1,44,166, కాపులు – 21,481, మైనార్టీలు (ముస్లిం, క్రిస్టియన్‌లు) – 5,267, ఇతరులు – 16, 536…మొత్తం కలిపి 2,61,516 మంది లబ్ధిదారులు.

Leave a Reply