– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మంగళగిరి : నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ రకమైన బాధ, ఆక్రోశం, ఈర్శ, పగ, ప్రతికార జ్వాలతో ఇబ్బంది పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనా కూటమి ప్రభుత్వాన్ని జగన్ అస్థిరపరచాలని చూస్తున్నారని మండిపడ్డారు. నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి ఊత సాయంతో ఎలా బయట పడాలని చూస్తాడో.. జగన్మోహన్ రెడ్డి తీరు అలా ఉందని ఎద్దేవా చేశారు. దళిత వర్గాలపై జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రేమ లేదన్నారు.
దళిత వర్గాలను మభ్యపెట్టాలని చూస్తున్నారని.. ఓసారి సక్సెస్ అయ్యి మరోసారి బొక్కబోర్ల పడ్డరాని అన్నారు. డా.బి. ఆర్ అంబేద్కర్ పై జగన్మోహన్ రెడ్డికి అసలు ప్రేమ లేదన్నారు. అంబేద్కర్ పై అంత ప్రేమ ఉంటే రూ.400 కోట్లు ఖర్చు చేసి విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం.. తాడెపల్లిలో ఇంట్లో ఉండి వైఎస్ జగన్ విగ్రహం ఓపెనింగ్ చేసినట్లు ఆరోపించారు. అంత ప్రాజెక్టు చేసి ఇంట్లో ఉండి ఓపెనింగ్ చేస్తారా..? అంబేద్కర్ పై ప్రేమ ఉందని చెప్పుకున్న వైసీపీ పోలీసు స్టేషన్ లో దళితులకు శిరోమండనం చేస్తే.. ఏం చేశారని ప్రశ్నించారు.
“కిరణ కుమార్ మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు తరిమి తరిమి చంపితే ఏం మాట్లాడలేదు. మీ సొంత నియోజక వర్గంలో దలిత మహిళ నాగమ్మపై దాడి జరిగితే మౌనంగా ఎందుకు ఉన్నారు. దళితడైన ప్రతాప్ లిక్కర్ తాగి ప్రభుత్వాన్ని ద్వేషించాడని చంపేశారు. ఆయన ఫోన్ కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. కొవ్వురులో దళితుడ్ని చంపారు. మాదిగ వర్గానికి చెందిన వ్యక్తిపై బేడీలు వేచి ఊరు మొత్తం తిప్పారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ప్రమాదవశాత్తు కాలిపోతే అక్కడ స్థానిక సర్పంచ్ రాజకీయం చేయాలనుకున్నాడని మండిపడ్డారు. ఈ కుట్రలో జగన్ భాగస్వామి.. జగనే స్క్రీప్ట్ రాసినట్లు ఆరోపించారు.
కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ మరోసారి సీఎం అవుతాడనుకోవడం సర్వకల అని పేర్కొన్నారు. ప్రజా విశ్వాసాన్ని వైసీపీ కోల్పోయ్యిందన్నారు. దళితులను మభ్యపెట్టాడానికి అంబేద్కర్ విగ్రహాలను పావులుగా వాడుకుంటున్నారన్నారు. అయిదేళ్ళ కూటమి ప్రభుత్వాన్ని జగన్ కదిలించడని మండిపడ్డారు. ప్రజలకు జగన్ కుయ్యోత్తులు తెలుసనని.. జిత్తులు మారిన నక్కలాంటి వాడు జగన్.. రంగులు మార్చే ఊసరవెల్లి జగన్మోహన్ రెడ్డి అని తీవ్రంగా ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దళితలు ప్రశాంతంగా ఉన్నారన్నారు.