తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. 12 డైరెక్టర్ పోస్టులకు బుధవారం జరిగిన ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఓట్లు లెక్కించారు. తిరుపతి టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలకు గాను అన్నింట్లో విజయదుందుబి మోగించింది. విజయం సాధించిన డైరెక్టర్లను వైయస్ఆర్సీపీ నేతలు అభినందించారు.