అమరావతి: సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆన్లైన్లో టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. దేవాదాయశాఖ స్థలాలు, దుకాణాల లీజు అంశంపై చట్ట సవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ‘అమ్మఒడి’ పథకం అమలుపై కేబినెట్లో చర్చ జరిగింది. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృతంగా ప్రచారం చేసే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ మధురవాడలో అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థకు 130 ఎకరాలు, శారదా పీఠానికి 15 ఎకరాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా వాడరేవు సహా 5 ఫిషింగ్ హార్బర్ల డీపీఆర్లకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈడబ్ల్యూఎస్కు ప్రత్యేకశాఖ ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. త్వరలో జనాభా లెక్కలు జరగనున్న నేపథ్యంలో బీసీ జనగణన చేపట్టాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చేనెల 15, 16 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…