Suryaa.co.in

Andhra Pradesh

పాడి పశువుల కొనుగోలు మాటున రూ.2,887 కోట్ల భారీ కుంభకోణం

– పాల వెల్లువ కాదు… వైసీపీ పాపాల వెల్లువ న
– తెనాలి మీడియా సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

చేయూత స్కీమ్ పేరుతో వైసీపీ స్కామ్. బీహార్ దాణా స్కామ్ కంటే పెద్ద కుంభకోణం. 3.94 లక్షల పాడి పశువులు కొనుగోలు చేశామని అసెంబ్లీలో చెప్పారు. అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉన్నవి కేవలం 8 వేల పాడి పశువులు మాత్రమే. పాడి పశువుల కొనుగోలు పేరుతో కొల్లగొట్టిన సొమ్ములు ఎటు పోయాయి? అక్కచెల్లెమ్మలను నిండా మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం. లక్షల పాడి పశువులు కొని ఉంటే పాల వ్యాపారంలో రూ.14 వేల కోట్లకుపైగా ఆర్థిక లావాదేవీలు జరిగేవి. పాల వెల్లువ కాదు… వైసీపీ పాపాల వెల్లువ నడుస్తోంది. పాడి పశువుల కొనుగోలుపై సమగ్ర విచారణ చేపట్టాలి… ప్రజా ధనాన్ని వెనక్కి తీసుకురావాలి.

LEAVE A RESPONSE