న్యూఢిల్లీ : అనంతపురంలోని సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు 31.24 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు విద్యా శాఖ సహాయ మంత్రి సుభాస్ సర్కార్ తెలిపారు. రాజ్యసభలో బుధవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ సెంట్రల్ యూనివర్శిటీ క్యాంపస్ నిర్మాణంపై సమర్పించిన డీపీఆర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 450 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ యూనివర్శిటీ గెస్ట్, విజిటింగ్ ఫ్యాకల్టీ ద్వారా నాలుగు అండర్ గ్రాడ్యుయేట్, ఏడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.