Suryaa.co.in

Telangana

38 కేసులు నమోదు: వికాస్ రాజ్

హైదరాబాద్: పోలింగ్ వేళ వివిధ కారణాలతో 38 కేసులు నమోదు చేశామని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. “రాష్ట్రంలో పోలింగ్ శాతం బాగానే నమోదైంది. 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరిగింది. తుది ఓటింగ్ శాతం ఎంత అనేది రేపు వెల్లడిస్తాం.. జీపీఎస్ ఉన్న వాహనాల్లో ఈవీఎంలు తరలిస్తాం. ఈ ప్రక్రియ అర్ధరాత్రి ఒంటి గంట వరకు జరగొచ్చు” అని వికాస్ రాజ్ తెలిపారు..

LEAVE A RESPONSE