Suryaa.co.in

Andhra Pradesh

పడవల తొలగింపు మొదలు

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రారంభమైంది. జలవనరుల శాఖ ఇంజినీర్లు రెండు భారీ క్రేన్లను తీసుకొచ్చి ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. 50 టన్నుల బరువు ఎత్తే సామర్థ్యం ఉన్న ఈ క్రేన్లతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 2,09,937 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. ప్రవాహం ఉండగానే పడవల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. 68, 69 గేట్లను మూసివేసి పనులు కొనసాగిస్తున్నారు.

LEAVE A RESPONSE