Suryaa.co.in

Andhra Pradesh

తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి

– ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

విజయవాడ: తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కేవలం 740 మంది క్యాథలిక్స్ ఉండే వాటికన్ సిటీ ప్రత్యేక దేశంగా ఉందని, కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తప్పేముందని ప్రశ్నించారు.

100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని, లడ్డూ నాణ్యతపై జూలై నెలలో ల్యాబ్ రిపోర్ట్ వస్తే, దాని గురించి సెప్టెంబర్ లో మాట్లాడటమేమిటని ప్రశ్నించారు.

లడ్డూ వ్యవహారంపై సుప్రంకోర్టులో జరుగుతున్న విచారణలో, మధ్యంతర ఉత్తర్వులను కోరుతూ పిటిషన్ వేశానని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. వీరు లడ్డూ గురించి మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలని, తన పిటిషన్ లో కోరానని కేఏ పాల్ తెలిపారు.

LEAVE A RESPONSE