– అసెంబ్లీ భవన నిర్మాణాలు పరిశీలించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ ప్రాంగణములో , తెలంగాణ శాసన మండలి భవనం పునర్నిర్మాణ పనులను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అతి త్వరలోనే శాసన మండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది.
తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా. నరసింహా చార్యులు, ఆర్&బి , అగాఖాన్ సంస్థ, మరియు తదితర అధికారులతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జరుగుతున్న పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” రాబోయే సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలోనే నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. శాసన మండలి నూతన సమావేశ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అతి త్వరలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని , తాజాగా ఇప్పటి వరకు పూర్తి అయిన పనుల గురించి సీఎం ఆరా తీశారని , ఖచ్చితంగా శాసన మండలి సమావేశాలు పాత భవనంలోనే నిర్వహించాలని వారు ఆదేశించారని తెలిపారు. పనులలో ఎలాంటి జాప్యం చేయకుండా , వేగం పెంచాలని , త్వరగా భవనాన్ని పూర్తి చేసి శాసన మండలి అధికారులకు అప్పగించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు .