– అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి
– రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం
– ప్రభుత్వం కట్టిన కాలేజీలు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్
– మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి
తాడేపల్లి: రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమం గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇలాగే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించి, ప్రభుత్వం మెడలు వంచేలా మనం పని చేస్తున్నాం. ప్రజా ఉద్యమంలో లక్ష్యాన్ని మించి ఏకంగా 1,04,11,136 సంతకాలు సేకరించడం జరిగింది.
కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాటలు వింటుంటే.. ఆశ్చర్యం కలుగుతోంది. తన గ్రాఫ్ పడిపోవడానికి కలెక్లర్లు కారణం అంటున్నారు. కలెక్టర్ల గ్రాఫ్ కాదు పడిపోతోంది. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ప్రజలకు ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు. మార్చి వస్తే, మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే రెండు బడ్జెట్లు పెట్టారు. కానీ, ప్రజలకు ఒక్కటంటే ఒక్క మేలు లేదు. గత పథకాలన్నీ సున్నా. కొత్తగా ఏదీ లేదు. గతంలో అమలు చేసిన అన్ని పథకాలు రద్దు చేశారు. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ లేవు. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఆరోగ్యశ్రీ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. ఇంకా సూపర్సిక్స్, సూపర్సెవెన్ మోసాలు.
ఈరోజు అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అసలు ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు అంటున్నాడు చంద్రబాబు. మనం గత ఎన్నికల్లో గెల్చిపోయి ఉండకపోతే, ఆర్టీసీ కూడా ఉండేది కాదు. అదే చంద్రబాబు వచ్చి ఉంటే, దాన్ని కచ్చితంగా అమ్మేవారు. ఈరోజు అన్ని వ్యవస్థలు తిరోగమనం. గతంలో అమలైన పథకాలన్నీ రద్దు. అన్ని ఘనకార్యాలు చేసిన చంద్రబాబు, కలెక్టర్ల సదస్సులో వారి (కలెక్టర్లు) పనితీరు బాగా లేదనడం దారుణం. చంద్రబాబు బుర్ర పని చేయడం లేదు.
ఈరోజు, 1,04,11,136 సంతకాలు సేకరణ ఒక చరిత్ర. అక్టోబరు 7న ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. అక్టోబరు 9న నేను నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించాను. ఆ తర్వాత అక్టోబరు 10 నుంచి డిసెంబరు 10 వరకు ప్రతి ఊరు, గ్రామం, పట్టణం, ప్రతి వార్డులో మెడికల్ కాలేజీల విషయాన్ని ప్రజలకు వివరించాం. చంద్రబాబు నిర్ణయం వల్ల కలిగే నష్టాలు, అనర్థాల గురించి వివరించాం.
ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటైతే.. ఆ సీట్ల వల్ల వైద్య విద్య అందుబాటులోకి రావడమే కాకుండా, అది కూడా తక్కువ వ్యయానికే చదివే అవకాశం కలుగుతుంది. ఇంకా మెడికల్ కాలేజీతో వచ్చే టీచింగ్ ఆస్పత్రి వల్ల అక్కడి ప్రజలకు సూపర్స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి.
ఉదా: కడపలో మెడికల్ కాలేజీతో 70 కి.మీ పరిధిలో పేదలకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. దాంతో ఎవరూ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లరు. ఎందుకంటే, పీజీ మెడికల్ స్టూడెంట్స్, మెడికల్ ప్రొఫెసర్లు అందరూ అందుబాటులో ఉంటారు.
అవన్నీ ప్రజలకు వివరించాం కాబట్టే, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సంతకాలు చేశారు. వారి ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఎవరూ ఎక్కడా భయపడలేదు. ధైర్యంగా ముందుకొచ్చారు.
ఆ తర్వాత ఆ పత్రాలు.. కోర్టు ద్వారాలు తడుతాయి. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. వారు ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్.జనార్థన్రెడ్డి సీఎంగా ఉండి, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తే, ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్ కాగా.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇస్తుందట!. ఇది మరో పెద్ద స్కామ్. ఒక మెడికల్ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది ఒక పెద్ద స్కామ్
రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. అందుకే చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నాం.
గవర్నర్గారు 40 మందికి అనుమతి ఇచ్చారు. లోక్భవన్కు వెళ్లే ముందు అంబేడ్కర్ విగ్రహం వరకు అందరం వెళ్దాం. అక్కణ్నుంచి 40 మందితో కలిసి గవర్నర్గారికి కలుస్తాం. ఆ తర్వాత కోర్టు తలుపు తడుతాం. అయినా చంద్రబాబు నిర్ణయం మార్చుకోకపోతే.. ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం.