– ప్రజల్ని కన్నింగ్ చేయటం గనుల్లో మైనింగ్ చేయటం తప్ప వైసీపీకి అభివృద్ది అంటే తెలీదు
-హౌస్ అరెస్టులతో మీ అక్రమాల్ని, అవినీతిని దాచలేరు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
వైసీపీ పాలనలో ప్రజల్ని కన్నింగ్ చేయటం, గనుల్లో మైనింగ్ చేయటం తప్ప రాష్ట్ర అభివృద్ది శూన్యం. గుంటూరు జిల్లా సుద్దపల్లిలో అక్రమ మైనింగ్ కి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న దూళిపాళ్ల నరేంద్రకు మద్దుతు తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేతల హౌస్ అరెస్టులు దుర్మార్గం. టీడీపీ నేతల్ని చూసి పిబ్రవరి నెలలోనూ జగన్ రెడ్డి చలితో వణుకుతున్నారు. వైసీపీ నేతల బండారం బయటపడుతుందనే టీడీపీ నేతల్ని ఇంట్లో నుంచి బయటకు రానివ్వటం లేదు. హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో మీ అక్రమాల్ని, అవినీతిని కప్పిపుచ్చుకోవాలనుకోవటం అవివేకం.
వైసీపీ నేతలు ప్రజా సమస్యలు గాలికొదిలి ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా అక్రమ మైనింగ్, అవినీతి జరుగుతోంది. వైసీపీ నేతలు అక్రమ సంపాదన కోసం ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.
ఇదేంటని ప్రశ్నించిన టీడీపీ నేతల్ని, ప్రతిపక్షనేతల్ని అక్రమ కేసులు, అరెస్టులతో భయపెడుతున్నారు. హౌస్ అరెస్టులు చేసిన టీడీపీ నేతల్ని వెంటనే విడుదల చేయాలి, అక్రమైనింగ్ పై విచారణ జరిపి నిజాలు ప్రజలకు చెప్పాలి. ప్రజలు మీ అరాచకాలన్ని చూస్తున్నారు. సరైన సమయంలో తగిన బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు.