Suryaa.co.in

Andhra Pradesh

ఉంగుటూరు మండలంలోభారీ అగ్నిప్రమాదం

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తెంపల్లి రైల్వే గేట్ సమీపంలో శ్రీవిద్య పాలిమర్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నప్పటికీ అదుపులోకి రాని పరిస్థితి ఏర్పడింది. కంపెనీలో సూపర్ సంచులు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్కూరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు.

LEAVE A RESPONSE