Suryaa.co.in

Features

అమెరికా అగ్రరాజ్యమా..హ్హ హ్హహ్హ!

అగ్ర రాజ్యమంటే ఆయుధసంపత్తి, అంతులేని సంపదేనా? శత్రువు అంతం చూసేవరకూ నిద్రపోని దేశమే కదా అగ్రరాజ్యం! తాను 20 ఏళ్ల తర్వాత తాను ఏ శత్రువుతోనయితే యుద్ధం చేసిందో, అదే శత్రువుకు ఆయుధాలన్నీ అప్పచెప్పిన అమెరికా అగ్రదేశమా?.. తన సైనికులకు చంపిన శత్రువు పక్కలో బాంబు పేల్చి 11 రోజుల్లోనే బదులు తీర్చుకునే భారత్ అగ్రదేశమా? చరిత్ర చెప్పిన సత్యమేమిటో చూడండి.
అది 18 సెప్టెంబర్ 2016 .. యూరి కాంప్ లోని మన భద్రతా దళాల మీద, నలుగురు ఇస్లామిక్ తీవ్రవాదులు గ్రనైడ్లతో విరుచుకుపడి 17 మంది సైనికులను కిరాతకంగా చంపేశారు..30 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు..
17 మంది అమరవీరుల శవపేటికలు ఢిల్లీ చేరాయి..
అమరవీరులకు నివాళి అర్పించడానికి, ప్రధాని ఇంకా ఇతర అత్యున్నత స్థాయి ఆర్మీఅధికారులు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.
ఒక్కొక్కరు అమరవీరుల పార్ధివదేహాలకు నమస్కారం చేసి, పూలమాల సమర్పించి వెనుతిరుగుతున్నారు..
ప్రధాని తన నివాళి అర్పించడానికి ముందుకు కదిలారు..కళ్ళు ఎర్రగా అయ్యాయి. నిప్పులు కురుస్తున్నాయి..కళ్ళనీరు బయటికి రానీకుండా శతవిధాల ప్రయత్నం చేస్తూ, ప్రతి సైనికుడి పార్ధివదేహం చుట్టూ ప్రదక్షిణం..అక్కడే తీవ్ర శపధం చేశారు.
ఎవడైతే ఈ దాడిని హ్యాండిల్ చేశాడో వాడ్ని, అమరవీరుల దశదిన కర్మ లోపు అంతం చేస్తాం అని!
మోదీజీ 11 రోజుల భవానీ దీక్ష తీసుకున్నారు..నడుముకు చురకత్తి కనబడకుండా, అంగవస్త్రాన్ని బలంగా కట్టారు.
27 సెప్టెంబర్ సాయంత్రం ఉజ్జయిని మహాకాల్ దర్శనానతరం
‘ జైభవాని ‘ అంటూ సింహనాదం.
చేరాల్సిన సందేశం చేరాల్సిన వారికి చేరింది.
సరిగ్గా 10 వరోజు రాత్రి.. అంటే 28 సెప్టెంబర్ 2016 న భారత సైన్యం పి‌ఓ‌కే లోకి చొచ్చుకుపోయింది.యూరీ దాడికి కుట్రచేసిన హాండ్లర్ తో సహా , 70 మందిని ఇండియన్ ఆర్మీ ఊచకోత కోసింది.
29న నల్లబట్టలతో గంగా స్నాన్..మూడు మునకల తర్వాత, ప్రశాంతంగా గంగ ఒడిలోంచి నడుచుకుంటూ చిర్నవ్వుతో మోదీజీ !
11 రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా నవ్విన మోదీజీ.
హిందూ సంప్రదాయం ప్రకారం, 11 వ రోజు పెద్ద దినం లోపు శత్రువును సంహరించిన తర్వాత ‘భవానీ’ దీక్షాంత్ చేసిన ప్రధాని.
ఇదీ ఒక హిందువు పగ తీర్చుకునే విధానం..పగ చల్లారేంత వరకూ కసితో నిద్ర కూడా పట్టనంత ఆగ్రహంతో ఊగిపోయిన భారత చక్రవర్తి.
ఒక్కడ్ని చంపడానికి కోట్లాది డాలర్లు ..వందలాది సైనికుల్ని త్యాగం చేసి, తిరిగి 20 ఏళ్ల తర్వాత ఎవడైతే శత్రువో వాడికే అత్యాధునిక ఆయుధాలు, అధికారం అప్పచెప్పిన అమెరికానా అగ్రరాజ్యం?
తన దేశపు సైనికులను చంపిన ఉగ్రవాదులను, 11 రోజుల్లోనే కుక్కల్ని చంపినట్టు చంపిన భారత్తా అగ్ర రాజ్యం?
రెండూ దేశాలూ డీల్ చేసింది ఇస్లామిక్ ఉగ్రవాదులతోనే! డీల్ చేస్తున్నది కూడా అదే ఉగ్రవాదులతోనే!!
అమెరికాను గొర్రె నడిపిస్తుంది..
భారత్ కు సింహం నాయకత్వం వహిస్తుంది..ఇదే తేడా!!
అమెరికా ఓడింది..ఓడిపోతూనే ఉంటుంది..
భారత్ గెలిచింది..గెలుస్తూనే ఉంటుంది..

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695

LEAVE A RESPONSE