Suryaa.co.in

Telangana

ఔటర్ పై మరొక ఇంటర్ చేంజ్

-రూ.29.50 కోట్లతో నార్సింగి ఇంటర్ చేంజ్ పూర్తి
-నేడు ప్రారంభించనున్న ఎంఏయుడి శాఖ మంత్రి కేటీ రామారావు

హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పైన మరొక ఇంటర్ చేంజ్ అందుబాటులోకి రానున్నది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటర్ చేంజ్ ను శనివారం ఉదయం పది గంటలకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. నార్సింగి ఇంటర్ చేంజ్ నిర్మాణం వల్ల నార్సింగి, మంచిరేవుల, గండిపేట్ ప్రాంతాల ప్రయాణికులతో పాటు లంగర్ హౌస్, శంకర్ పల్లి ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఓఆర్ఆర్ మీదుగా వారి గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంతో సులువు అవుతుంది.

LEAVE A RESPONSE