వైసీపీ నేతల అరాచకాలకు మరొక గిరిజన మహిళా ఉద్యోగి బలి

-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

జగన్ రెడ్డి అండతో వైసీపీ నేతలు సాగిస్తున్న అరాచకాలకు మరొక గిరిజన మహిళా ఉద్యోగి బలి కావడం రాష్ట్రంలో భయానక పాలనకి అద్దం పడుతోంది. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ వైసీపీ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యకి పాల్పడింది. ఎస్టీ మహిళా ఉద్యోగిని వేధించి బలవన్మరణానికి కారకులైన వైసీపీ నేతల్ని తక్షణమే అరెస్టు చేయాలి. డాక్టర్ సుధాకర్ నుంచి భవానీ వరకూ ప్రభుత్వ ఉద్యోగుల మరణాలన్నీ వైసీపీ చేసిన హత్యలే. ఈ హత్యలని తప్పుదారి పట్టిస్తూ, నిందితులైన వైసీపీ నేతలని కాపాడుతున్న పోలీసులు.. అధికారులకీ జగన్ రెడ్డి క్రూర పాలనలో ఇదే గతి పట్టొచ్చు. వైసీపీ బాధితులైన సాటి ఉద్యోగులకి అండగా నిలవండి.

Leave a Reply