ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకి ఘన సత్కారం

గుంటూరు : తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుని ఏపీ ప్రభుత్వ సలహాదారులు జివిడి కృష్ణమోహన్ ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే, ఏపీ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్‌ మల్లాది విష్ణు, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని వెంకటరామయ్య(నాని), నవరత్నాలు ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఏఎన్‌ నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, లిడ్కాప్ చైర్మన్ రాజశేఖర్ లు పాల్గొని దుశ్శాలువలతో, పుష్పగుఛ్చాలతో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అభినందించారు.

ఈ సంధర్బంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏపీ ప్రభుత్వ సలహాదారులు జివిడి కృష్ణమోహన్ ని సత్కరించి.. తాను స్వయంగా రచించిన రాష్ట్రంలో రాజకీయం, తెలుగు ప్రజాతీర్పు, శాసనసభ చర్చల సరళి, ఆంధ్ర ప్రజాతీర్పు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల, లోక్ సభ సభ్యుల సామాజిక విశ్లేషణ పుస్తకాలను అందించారు.

Leave a Reply