బీసీ హాస్టళ్లా.. మృత్యు కేంద్రాలా?

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

విజయనగరం జిల్లా కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో నిద్రిస్తున్న 8 వ తరగతి విద్యార్థుల్ని పాము కాటు వేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో బంగారు భవిష్యత్తు వున్న విద్యార్థి మృతి చెందడం, ఇద్దరి పరిస్థితి విషమంగా వుండటం తీవ్ర విచారకరం. విద్యార్థులకి మెరుగైన చికిత్స అందించాలి. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. పిల్లల్ని సురక్షితంగా చూసుకోవాల్సిన గురుకులాలను జగన్ రెడ్డి సర్కారు పట్టించుకోకపోవడంతో, మృత్యు కేంద్రాలు కావడం రాష్ట్రంలో విద్యావ్యవస్థ దుస్థితికి నిదర్శనం.

Leave a Reply