Suryaa.co.in

Andhra Pradesh

పిరియాడికల్ లేబర్ ఫోర్స్ నివేదిక ఆధారంగా ఈనాడులో ప్రచురితమైన వార్తలు తప్పని నిరూపించగలరా?

– సాక్షి టీవీని వెంటబెట్టుకురండి ప్రజా క్షేత్రంలోకి వెళ్లి నిజానిజాలు తేల్చుకుందాం
-రామోజీరావు ఎక్కడ ఏ వార్త రాసి డబ్బులు సంపాదించారో నిరూపించగలరా?
– టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్

రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రంలో ప్రజా ధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు..

జగన్ ప్రభుత్వ ధనాన్ని రెండు రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ స్కీములపేరుతో స్క్యాములకు పాల్పడుతున్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం, జగన్ పాలనా వైఫల్యాలు అడుగడుగునా కనబడుతున్నాయి. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్తోంది.

కక్షపూరిత రాజకీయాలతో కాలం వెళ్లబుచ్చుతోంది. రాష్ట్రంలో విధ్వంసకాన్ని సృష్టించడం తప్ప అభివృద్ధి శూన్యం. ప్రభుత్వం ప్రజాస్వామిక, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోంది. ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపితే, అవినీతిని ప్రశ్నిస్తే కక్షగట్టి కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టినవారిని అర్ధరాత్రిళ్లు నిర్భందిస్తున్నారు. వారిని ఊరూరా తిప్పి వేధిస్తున్నారు. పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.

రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది
రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది. కారణం పరిశ్రమలను వెళ్లగొట్టడం, కొత్త పరిశ్రలను రాకుండా చేయడమే. రాష్ట్రానికి రావాల్సిన సుమారు లక్షా పాతిక కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రాకుండా భయపెట్టి పారిపోయేలా చేశారు. పరిశ్రమలు రాకుండా పారిశ్రామికులను భయపెట్టి పలాయనం చిత్తగించేలా చేశారు. ఆసియా పేపర్, జాకీ ఇండస్ట్రీస్, లూలూ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫ్రాంక్లిన్ అండ్ టెంపుల్, డేటా సెంటర్, అమర్ రాజా బ్యాటరీస్ లతో చేసుకున్న ఎంఓయూలు కంపెనీలు క్లోజ్ చేశాయి. దాదాపు 2 లక్షల ఉద్యోగస్థులు రోడ్ల పాలయ్యారు. కావాలని కక్ష కట్టి పరిశ్రమలను తరిమేసినట్లు ఈనాడులో ఆర్టికల్ కూడా ప్రచురితమైంది.

పట్టభద్రులు నిరుద్యోగంలో నెంబర్ వన్ అని కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో వచ్చింది. ఆ నివేదికను కూడా ఈనాడులో ప్రచురితమైంది. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక దాన్ని స్పష్టం చేసింది. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం రాష్ట్రంలో డిగ్రీ చదివినవారిలో నిరుద్యోగ రేటు 24 శాతం ఉంది. ఇది నెంబర్ వన్. ఆ తరువాతే ఇతర రాష్ట్రాలు. రాష్ట్రంలో రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రతి ఏడాది డీఎస్సీలు వేస్తామని హామీలిచ్చి మరిచారు, గ్రూప్ వన్, గ్రూప్ 2 పరీక్షలు లేక నాలుగేళ్లల్లో మొత్తం 1,340 మంది బలవన్మరణం పొందారు. పరిశ్రమలు మూతపడడంతో నిరుద్యోగం తాండవిస్తోంది.

రాష్ట్రంలో జగన్ వచ్చాక రాజకీయ కక్షలు పెరిగాయి
రాష్ట్రంలో జగన్ వచ్చాక రాజకీయ కక్షలు పెరిగాయి. పారిశ్రామికవేత్తలను వ్యాపారాల్లో వాటాలు ఇవ్వమంటారు.50 శాతం వాటాలు ఇవ్వాలి. ఖర్చులు వారే పెట్టుకోవాలి. ఇదెక్కడి న్యాయం? పరిశ్రమలు ప్రభుత్వానికి50 వాతం వాటాలు ఇవ్వలేకపోయాయి. దీంతో ప్రబుత్వ యంతాంగం కేసులు పెట్టడం మొదలుపెట్టారు. అమర్ రాజ విషయంలో ఈ సంఘటన స్వయంగా చూశాం. పెట్టుబడి పెట్టనివ్వరు, బెదిరిస్తారు. సంపాదన లో వాటాలు కావాలి. విధ్వంసకరమైన పాలన రాష్ట్రంలో జరుగుతున్నందున పరిశ్రమలు తరలిపోయాయి. నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. రాజకీయ పరంగా ప్రతిపక్ష నాయకుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు.

తప్పలు ఎత్తిచూపితే దాడులు
ప్రభుత్వపు తప్పులు ఎత్తిచూపితే వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు. ఫిజికల్ గా చర్యలు తీసుకుంటున్నారు. పిరియాడికల్ లేబర్ ఫోర్స్ నివేదిక తప్పా? నిజమా? అనేదానిపై సమాధానమివ్వాలి. సమాధానం చెప్పకుండా రామోజీరావును దూషిస్తే ఉపయోగమేమి? పిరియాడికల్ లేబర్ ఫోర్స్ నివేదికలో వచ్చిన ఆర్టికల్ అబద్ధమా? రైతు వ్యతిరేక విధానాలు అవలంబించారు. ఆదుకోవడంలో వైఫల్యమే. రాష్ట్ర అభివృద్ధి శూన్యం. విశాఖ పట్నం ఆల్ రెడీ డెవలప్ అయింది. దాన్ని డెవలప్ చేసేదేముంది? విశాఖపట్నంలో భూ కబ్జాలు పెరిగాయి. శాంతి భద్రతలు తగ్గాయి. ప్రైవేటు ఆస్తులు ఆక్రమించారు. అశాంతి ఏర్పడింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వారికి ప్రాణ, మాన, ఆస్తులకు రక్షణ లేదు. ఈ విషయాన్ని నిరూపిస్తాం. సాక్షి ని వెంటబెట్టుకొని రండి.

టీడీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీకి నిద్ర పట్టడంలేదు
వైసీపీకి నిద్ర పట్టడంలేదు, రామోజీరావు, చంద్రబాబులను తిట్టనిదే రోజు గడవదు. వారు చేసిన మంచి పనులు తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళ్దాం. నిష్పచ్ఛపాతంగా వారు చేసిన మంచి పనులు తెలుస్తాయి. ప్రజలపై దౌర్జన్యాలు రాష్ట్రానికి పట్టినదురదృష్టం. ప్రభుత్వ ధనంతో రాష్ట్రా ఖనిజ అభివృద్ధి సంస్థ జగన్ పుట్టినరోజునాడు అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రజల డబ్బుతో సాక్షి పత్రికలో ప్రకటనలు ఇస్తే ఆ డబ్బు జగన్ కే దక్కుతుంది. ఇలా ఏ ప్రభుత్వంలోనూ లేదు. పత్రిక కథనాలు విమర్శించే స్థాయి ప్రబుత్వంకు లేదు. ప్రతి దానికి గడ్డి తినడమేనా?

ఉంటానికి ఇల్లు లేదన్నవారు ఇన్ని ప్యాలెస్ లకు అధిపతి ఎలా అయ్యారు?
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు ఇంటి స్థలం లేక రాష్ట్ర ప్రభుత్వం నుంచి గజానికి వెయ్యి రూపాయల చొప్పున ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లి స్థలం తీసుకున్నారు. దీన్ని రెగ్యులరైజ్ చేయించుకున్నారు. ఇంటికి స్థలం లేదని చెప్పుకున్నవారికి ఇప్పుడు ఇన్ని ప్యాలెస్ లు ఎలా వచ్చాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా లెక్క ప్రకారం జగన్ లక్ష కోట్లు దోచుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం సీబీఐ లెక్క ప్రకారం రూ. 43 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడిన విషయం అదరికీ తెలుసు.

రామోజీరావు నిస్పక్షపాతంగా వ్యవహరిస్తారు
రామోజీరావు నైతిక విలువలు పాటిస్తూ, నిస్పక్షపాతంగా వ్యవహరిస్తు ఈ స్థాయికొచ్చారు. దేశంలో ఇంగ్లీష్ వరల్డ్ మేగజైన్ అత్యంత రాజకీయ అవినీతి పరుడు జగన్ అని రాసింది. దానికి కారణం రామోజీరావే అని చెబుతారా?.సాక్షి లో మీ పుట్టిన రోజునాడు యాడ్స్ ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయో తెలపాలి. రైతులు, నిరుద్యోగులు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రాన్ని విధ్వంసక పర్వంలోకి నెట్టేసి మీ పబ్బం గడుపుకుంటున్నారు. పైగా ఎదురుదాడులు చేస్తున్నారు.

పోలీసులను ప్రైవేట్ ఆర్మీగామార్చుకున్నారు
మీ ప్రైవేటు ఆర్మీ ని అనగా పోలీసులను ప్రైవేటు ఆర్మీగా మార్చుకున్నారు. నిరసన వ్యక్తంచేసినవారిపై దాడులు చేయిస్తున్నారు. మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడైనా కనువిప్పి కలగాలి. లేచినప్పటి నుంచి మంత్రులు చంద్రబాబును, రామోజీరావును దూషించడమే పనిగా పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ ను దత్తపుత్రుడు అంటూ వెటకారంగా మాట్లాడుతారు.

చంద్రబాబు నిద్రాహారాలు మాని ప్రజలకు సేవ చేశారు. గందరగోళం సాక్షిలో ఏరోజైనా ఉన్నది ఉన్నట్లుగా రాశారా? సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నది ఉన్నట్లుగా ప్రచురించకుండా వక్రీకరించి రాస్తారు. జర్నలిజాన్ని భ్రష్టు పట్టించారు. వ్యక్తిగత అధికార పత్రిక సాక్షి. దీన్ని ప్రభుత్వ పత్రికగా భావిస్తున్నారు. పంచాయతీలకు డబ్బులిచ్చి గవర్నమెంటు డబ్బులతో సాక్షి పత్రికను కొనిపిస్తున్నారు. అది కూడా కోర్టులో కేసు నడుస్తోంది. విధ్వంసకరపాలన గురించి ప్రజలు తెలుసుకోవాలి. ఎదుటివారిపై దాడులు చేయడం మానాలి.

వైసీపీ చేసిన గొప్పలు ఏమిటో చెప్పుకోవాలి. మీరు చేసిన తప్పులను మేం ఎత్తిచూపుతున్నాం. అది కాదని మీరు నిరూపించాలి. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతూనే ఉంటే మీ సాక్షి పత్రికను మీరే మూసుకోవాల్సి వస్తుంది. మీ పాలన ఎంతోకాలం సాగదు. మీకు మిగిలింది మూడు నెలల కాలమే. ఈ మూడు నెలల కాలంలో మీ భాగోతాలన్నీ బయటకు వస్తాయి. సత్యాన్ని గురించి మీరు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. కడియం శ్రీహరి మాట్లాడుతూ జగన్ అవినీతి గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వొచ్చిందన్నారు.

మార్గదర్శిపై, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టటానికే మీకు టైం సరిపోవటంలేదు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజలను బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారు. వైసీపీకి నైతిక హక్కులు లేవు. మోరల్స్ లేవు. రాజకీయపరమైన విలువలు లేవు, వ్యక్తిగత క్రమశిక్షణ లేదు. మరొకసారి నీతులు చెప్పద్దు. రేప్పొద్దున ప్రతిపక్షంలో ఉంటారు, అప్పుడు గౌరవించడానికి కొన్ని ఎథిక్స్ పాటించండి. అప్పుడే మీకు భవిష్యత్తు ఉంటుంది. అది కూడా లేకుండా చేసుకోవద్దు. మీ పార్టీలోని నాయకులే తిరగబడుతున్నారు. మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరొకసారి ప్రజల్లోకి వెళ్లి విచారిస్తే తెలుస్తుంది. మిమ్మల్ని నమ్ముకున్నవారినే మీరు న్యాయం చేయలేకపోయారని టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు.

LEAVE A RESPONSE