– మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ
హైదరాబాద్: శేర్లింగంపల్లి నియోజకవర్గం ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బస్తీలో ఉండే ప్రజలను సుస్తీ చేసి నయం చేసే విధంగా కేసీఆర్ ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు ఇది. బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగవద్దు. తమ గడప దగ్గరనే, తమ వాకిట్లోనే వైద్యం అందించాలని ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానలను కేసీఆర్ ప్రారంభించారు
రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే హైదరాబాదులో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశాని హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 110 రకాల మందులు ఉచితంగా అందించే వాళ్ళం. 130 రకాల పరీక్షలను ఉచితంగా చేసి పేషంట్ల ఫోన్లకే రిపోర్టులు పంపించే వాళ్ళం. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టింది.
ఆరు నెలల నుండి జీతం రావడం లేదు. స్టాఫ్ నర్స్ దేవమ్మకు ఐదు నెలల నుండి జీతం రాలేదు. సపోర్టింగ్ స్టాఫ్ ని అడుగుతే ఆరు నెలల నుంచి జీతం రాలేదంటున్నారు. బస్తీ దవాఖానలో పనిచేసే సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వారు పని ఎలా చేస్తారు?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి. చెప్పడమేమో ఒకటో తారీకు అందరికీ జీతాలు ఇస్తామని చెప్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలో పనిచేస్తున్న సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతం లేదు. కేవలం 60, 70 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి 40 రకాల మందులు సప్లై లేదు అని చెప్పారు.
పేషెంట్లను మాట్లాడితే కొన్ని మందులు ఇస్తున్నారు కొన్ని మందులు బయట కొనుక్కోవాలని చెప్తున్నారు అని అంటున్నారు. టెస్టులలో బి12 డి3 టెస్టులకు రీ ఏజెంట్లు సప్లై లేకపోవడం వల్ల అన్ని రకాల టెస్టులు జరగడం లేదు. బస్తీ దవాఖనలో మందులు సరఫరా చేసే తెలివి ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ సిబ్బందికి జీతాలు వస్తున్నాయా లేదా అనే రివ్యూ చేసే తెలివి రేవంత్ రెడ్డి కి లేదా?
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో 108 సర్వీస్ సకాలంలో రాకపోవడం వల్ల, వైద్యం అందకపోవడం వల్ల మనిషి ప్రాణం పోయింది. ముఖ్యమంత్రి తన గురించి ఆలోచించుకుంటాడు తప్ప ప్రజల గురించి ఆలోచించడు. హాస్పిటల్లో కేసీఆర్ కిట్టు ఇవ్వకపోవడం వల్ల 20% డెలివరీలు ప్రైవేటు ఆసుపత్రికి బదిలీ అయ్యాయి.
కేసీఆర్ మీద కోపంతో పథకాలను బంద్ చేస్తే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎంతసేపు మద్యం దుకాణాలు పెంచుదామా, సారా ఎట్లా అమ్ముదామా, పైసలు ఎట్ల సంపాదిద్దామా, అని తప్ప వేరే ఆలోచన లేదు రేవంత్ రెడ్డికి.
వైన్ షాపుల టెండర్లకు రెండు లక్షల నుండి మూడు లక్షలకు పెంచి అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు.
జనం తాగాలే ఊగాలే రేవంత్ రెడ్డి కిట్టి నిండాలి. ఒకనాడు అయినా ప్రజా ఆరోగ్య వ్యవస్థ పై రివ్యూ చేసావా రేవంత్ రెడ్డి. కెసిఆర్ పాలనలో 15 ఆర్థిక సంఘం బస్తీ దవాఖానలను ప్రశంసించింది. కాంగ్రెస్ పాలనలో బస్తీ ప్రజల కూడా ప్రశంసించడం లేదు. ఈ బస్తి దవాఖానకు కరెంటు సరఫరా లేదు దొంగ కరెంటు వేసుకున్నారు. కనీసం బస్తీ దావాఖానలలో బీపీ మీటర్లు పనిచేయటం లేదు. ప్రవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని హెచ్చరించాయి. కెసిఆర్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద రూ.7,000 కోట్ల చెల్లింపులు చేసింది. 3000 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద అందించింది కెసిఆర్ ప్రభుత్వం.
ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పనిచేయడం లేదు. ఉద్యోగులకు వారి కుటుంబాలకు, జర్నలిస్టులకు వారి కుటుంబాలకు ఆరోగ్య సేవలు ఈ ప్రభుత్వం అందించడం లేదు. రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క రూపాయి కూడా ఈ హెచ్.ఎస్ జ.హెచ్.ఎస్ కు విడుదల చేయలేదు. నగరానికి నాలుగు దిక్కుల్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ప్రారంభిస్తే రెండు సంవత్సరాల నుంచి పనులు జరగడం లేదు.
బస్తీ దవాఖానలో డాక్టర్లకు, సిబ్బంది ఆరు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వారి జీతాతాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
బస్తీ దావఖానాలో 110 రకాల మందులు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. 134 రకాల వైద్య పరీక్షలు బస్తీ దవాఖానలో పూర్తిగా ఉచితంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని సిబ్బంది మానేశారు. తక్షణమే ఖాళీలను నింపాలని డిమాండ్ చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు హైదరాబాద్ ప్రజలు గమనించాలి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్కు ఓటేస్తే బస్తి దవాఖానలలో మందులు లేకున్నా, డాక్టర్లు లేకున్నా, వైద్య పరీక్షలు లేకున్నా నాకే ఓటేసారు అనుకుంటాడు.
ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపాలంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలి. జూబ్లీహిల్స్ లో ఉండే మీ బంధుమిత్రులకు కాంగ్రెస్ నిర్లక్ష్యం గురించి చెప్పండి. సీఎం తన కిట్టీ నిండుతోందా లేదా ఆలోచిస్తున్నారు తప్ప పేదల కుపయోగపడే కేసీఆర్ కిట్ల గురించి ఆయనకు ఎందుకు? రేవంత్ రెడ్డి సర్కార్ కు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించాలి