Suryaa.co.in

Andhra Pradesh

శవరాజకీయం వైసీపీ నైజం..

– టీడీపీ నేత శ్రీను హత్యను ఖండిస్తున్నాను
– నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
– శ్రీను కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుంది
– బీసీ జనార్ధన్ రెడ్డి

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలకు పెట్టింది పేరు. అధికారం కోల్పోయిన తర్వాత హత్యారాజకీయాలతో తమ పార్టీని నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కర్నూలుజిల్లా, పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు శ్రీనును వైసీపీ నాయకులు అత్యంత కిరాతకంగా చంపి పొట్టనపెట్టుకున్నారు. రాజకీయ హత్యలు చేస్తున్నారు అని ఊరూరా తిరిగి ఏడ్చి గగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ హత్యకు సంబంధించి ఏ సమాధానం చెబుతాడని ప్రశ్నిస్తున్నాను.

వైసీపీ నాయకులు టీడీపీ నేతలను హత్యలు చేస్తుంటే, తిరిగి ఆ రక్తపు మరకలను టీడీపీ అంటగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి, వైసీపీ శ్రేణులు ఆ బాధను దిగమింగలేక మా పార్టీ శ్రేణులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. శ్రీను కుటుంబానికి తెలుగుదేశంపార్టీ, ప్రభుత్వం అండగా నిలబడుతుంది. హంతకులు, నిందితులు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరు. హత్య చేసిన వారు, దాని వెనుక ఉన్నవారు చట్టప్రకారం అతి త్వరలో శిక్షింపబడతారు. హత్యలతో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలనే జగన్ ప్రయత్నాలకు త్వరలోనే తెరపడుతుంది.

LEAVE A RESPONSE