Suryaa.co.in

Telangana

వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి

-విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావద్దు
-విద్యుత్ అధికారులు, సిబ్బంది సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

కొద్దిరోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో యావత్ విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో ఈదురు గాలుల మూలంగా చెట్లు విరిగిపడడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిపడడం వంటి సంఘటనలు సాధారణంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వేను వెంటనే స్పందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

రాష్ట్ర ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తు అందుబాటులో ఉంది, సరఫరా లోను ఎ టువంటి అంతరాయం తలెత్తకుండ చర్యలు చేపట్టాలని అన్నారు. లైన్స్ క్లియరెన్స్ (LC) విషయంలోనూ జాగ్రత్త వహించాలని సూచించారు. ఒకేసారి పలు ప్రాంతాల్లో LC ఇవ్వడానికి వీలు లేదు, ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతంలో LC ఇవ్వాలని సూచించారు. LC తీసుకుంటున్న సమయంలోను స్థానికంగా ఉన్న వినియోగదారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి మొదలు లైన్ మెన్ వరకు అప్రమత్తంగా ఉండాలి, నిరంతరం సమీక్షలు చేసుకుంటూ సమాచారం చేర వేసుకోవాలన్నారు. సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి SMA రిజ్వీ, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సి .ఎం. డి ముషారఫ్ అలీ, ట్రాన్స్ కో jmd శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE