Suryaa.co.in

Andhra Pradesh

పిఠాపురంలో లక్షకు ఐదు లక్షలు బెట్టింగ్

(రమణ)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అందరి చూపు పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? వంగా గీత పైన విజయం సాధిస్తాడా?

ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది? ఇక నేడు రాబోతున్న ఎగ్జిట్ పోల్స్ పవన్ కళ్యాణ్ విజయం పైన ఎలాంటి అంచనాలను నివేదిస్తాయి? వంటి అనేక అంశాలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

పవన్ కళ్యాణ్ మెజార్టీ పైనే చర్చ
అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడని, రాష్ట్రంలోని అందరికంటే ఎక్కువ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడని ఇక ఏపీలో పవన్ కళ్యాణ్ మెజారిటీ పైన లక్షకు ఐదు లక్షలు అంటూ బెట్టింగులు కడుతున్నారని ఒక ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

పవన్ పోటీతో పిఠాపురంకు పెరిగిన క్రేజ్
అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో పిఠాపురం నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. లోకల్, నేషనల్ మీడియా కూడా ఏపీ ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తయితే, పిఠాపురం నియోజకవర్గం లోని ఎన్నికల ఫలితాలు మరో ఎత్తు అన్నట్టుగా చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కచ్చితంగా పిఠాపురంలో గెలుస్తారని, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారని టిడిపి కూటమి నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

పవన్ కు రాష్ట్రంలోనే టాప్ మెజార్టీ
జనసైనికులు అయితే భారీ మెజార్టీతో గెలుస్తాడని చెబుతున్న పరిస్థితి ఉంది .అయితే ఏపీలో రాష్ట్రంలో అందరికంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ మెజారిటీ వస్తుందని బెట్టింగ్ రాయుళ్ళు బెట్టింగులు కడుతున్నారు. ఇక ఈ విషయం తాజాగా ఒక ఆడియోతో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే, చంద్రబాబు, లోకేష్ కంటే కూడా పవన్ బంపర్ మెజారిటీతో బెట్టింగ్ రాయుళ్లు పందానికి దిగుతున్నారు.

LEAVE A RESPONSE