Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచం బి.జె.పి

– కాంగ్రెస్ పార్టీనీ నిందిస్తే బి.జె.పీకి నొప్పి పుడుతుంది.
– బి.జె.పి,కాంగ్రెస్ పార్టీల చీకటి స్నేహం.
– పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముద్దుబిడ్డానా?
– గోపాల్ పేట మండల రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

గోపాల్ పేట: ఏప్రిల్ 27న వరంగల్ నందు జరగబోవు రజతోత్సవ సన్నాహక సమావేశం ఈరోజు గోపాల్ పేట మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు బి.బాలరాజు అధ్యక్షతన జరిగింది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి అండ కె.సి.ఆర్ గులాబీ జెండా అని.. బి.జె.పి,కాంగ్రెస్ పార్టీలు చీకటి స్నేహం చేస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని అన్నారు.పాలమూరు ముద్దుబిడ్డను అని చెప్పుకొనే రేవంత్ రెడ్డి కేవలం 600కోట్లు ఖర్చు పెడితే 12లక్షల ఎకరాలకు సాగు నీళ్ళు ఇవ్వవచ్చని, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మార్కెట్ యార్డ్ ఏర్పాటులో నిబంధనలు పాటించకుండా కాంగ్రెస్ ఆర్భాటం చేస్తున్నారు.మండలం లో మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలంటే ప్రాథమిక నోటిఫికేషన్ ఇస్తారు. దాని తర్వాత తుది నోటిఫికేషన్ తర్వాత గెజిట్ వస్తుంది. ఈ నిబంధనలు పాటించకుండా ప్రజలను మభ్యపెట్టడానికి శంకుస్థాన చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో విఫలమైందని కరెంట్ కోతలు,సాగు నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులకు రుణమాఫీ లేదని,రైతు భరోసా లేదని,రైతు బీమా లేదని,యువకులకు 2లక్షల ఉద్యోగాలు లేవని,మహిళలకు 2500లేవని,తులం బంగారం లేదని,రైతు కూలీలకు 12000 లేవని, రియల్ ఎస్టేట్ కుదేలు అయిందని భూముల ధరలు సగానికి పడిపోయాయని జీవనాధారం కోల్పోయి రియల్టర్స్,మధ్యవర్తులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాలలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కె.సి.ఆర్ రజతోత్సవ సభకు సంకల్పించారని లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచారు.

LEAVE A RESPONSE