– బ్రాహ్మణ ఫెడరేషన్ కు మంత్రి శ్రీధర్ బాబు సూచన
– సెక్రటరీ జనరల్ రవికి అభినందనలు
హైదరాబాద్: బ్రాహ్మణులను సంఘటితం చేసి అన్ని రంగాల్లోనూ సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభిప్రాయ పడ్డారు.
అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ గా నూతనంగా ఎన్నికైన ద్రోణంరాజు రవి కుమార్ బుధవారం మంత్రి శ్రీధర్ బాబు ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవి కుమార్ ను అభినందించిన మంత్రి ఫెడరేషన్ కార్యకలాపాలను మరింత క్రియాశీలకం చేయాలన్నారు. బ్రాహ్మణులను సంఘటితం చేసి సాధికారత సాధించాలని, అదే సమయంలో సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేలా చూడాలన్నారు.
పదిహేనేళ్ల విరామం తదుపరి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి జాతీయ సెక్రటరీ జనరల్ పదవి దక్కడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమం లో జంటనగర్ల మాజీ అధ్యక్షులు తులసి శ్రీనివాస్ పాలుగోన్నారు