– ప్రశాంత్ రెడ్డి ఇంత అజ్ఞానా?
– మీరు ఎంత అరిచి గీ పెట్టినా.. దేశానికి రోల్ మోడల్ రోడ్లు నిర్మించి తీరుతాం
– ప్రశాంత్ రెడ్డి ఆరోపణలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: హ్యామ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే రోడ్లలో 8వేల కోట్ల స్కాం జరుగుతుందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశాంత్ రెడ్డి ఆరోపణలపై మంత్రి తన దైన శైలిలో సమాధానమిచ్చారు.
ఇటీవల బిఆర్ఎస్ నేతల ప్రెస్టేషన్ మాటలు వింటుంటే జాలేస్తుంది. అద్దం లాంటి రోడ్లు వేస్తామంటే బిఆర్ఎస్ వాళ్ల గుండెలు అదురుతున్నాయి. పచ్చకామెర్లోడికి లోకమంతా..పచ్చగానే కనిపిస్తుందన్నట్లు..అన్నిట్లోస్కాం లు చేసిన మీకు ఏది చూసిన స్కామే కన్పిస్తుంది
కవిత వేరే కుంపటి పెట్టుకుంది..హరీష్ రావు కొత్త పార్టీ కోసం చూస్తున్నాడు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడే..కానీ ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇంత అజ్ఞానా? అని విచారిస్తున్న. CRIF రోడ్లకు.. హ్యామ్ రోడ్ల విధానికి చాలా తేడా ఉంటుంది.. R&B శాఖ మంత్రిగా పనిచేసిన నీకు ఇది తెలియకపోవడం బాధాకరం.
కళ్ళద్దాలు పెట్టుకొని కూడా..0.4% ను 4% అని చదివావంటే నీ ఆరోగ్యం పై నాకు ఆందోళన కలుగుతుంది మిత్రమా? 15 సంవత్సరాల్లో ఒక్క కి.మీ మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేసేది కేవలం 20లక్షల లోపే..నీకు 2కోట్లు ఎలా అనిపించింది? నేను 6 సార్లు ప్రజల ఆశీర్వాదంతో చట్టసభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధిని..ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో చిన్న మచ్చ(ఆరోపణ) కూడా నాపై లేదు. నేను అవినీతిని ప్రోత్సహించే వ్యక్తిని కాదు. అవినీతి జరిగితే చూస్తూ ఊరుకోను.
తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధ పడ్డోడిని. నా చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల మేలు కోసమే పనిచేస్తా. మీరు ఎంత అరిచి గీ పెట్టినా దేశానికి రోల్ మోడల్ రోడ్లు నిర్మించి తీరుతాం. ఈ రోడ్లు గనుక పూర్తయితే వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ 10 సీట్లకే పరిమితం అవుతుందనే భయం మీకు పట్టుకుంది.
కాళేశ్వరం స్కాం,యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం స్కాం,ధరణి స్కాం,గొర్రెల స్కాం ఇలా చెప్పుకుంటూ పోతే పదేళ్ల కాలంలో మీరు చేసిన స్కాంలకు అంతే లేదని మండిపడ్డారు. కవిత వేరే కుంపటి పెట్టుకుంది..ఇవాళ్టి నుండి జనాల్లోకి అంటూ వెళ్తున్నది. మరోవైపు హరీష్ రావు కొత్త పార్టీ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది అని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుండడం, ఆ పార్టీ నేతలు చెట్టుకొకరు, పుట్టకొక్కరు అవడం చూసి చోటా మోటా బిఆర్ఎస్ నేతలు అయోమయంలో పడి ఆగం ఆగం అవుతున్నారనీ విమర్శించారు.
“మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడే..కానీ ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇంత అజ్ఞానా..? అని విచారం వ్యక్తం చేస్తున్న” అని అన్నారు. CRIF లో కి. మీ1.75 కోట్లు అవుతుందన్నది సింపుల్ వైడెనింగ్ కోసం మాత్రమే. అదే హ్యామ్ మోడల్ లో చేస్తున్నది డబుల్ లేన్ బలోపేతం. అది కూడా NHAI నార్మ్స్ ప్రకారం చేస్తున్నాం.
కి.మీ రోడ్డు మెయింటెనెన్స్ కోసం 2 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నారు. ఒక్క కి.మీ రోడ్డు కోసం 6 కోట్లు అవుతుందని అసత్యాలు మాట్లాడాడని, నిజానికి 15 సంవత్సరాల్లో ఒక్క కి.మీ మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేసేది కేవలం 20లక్షల లోపే. మొత్తం ఒక్క కి.మీ మీద మొత్తం కాలానికి 2కోట్ల 90 లక్షలు మాత్రమే అవుతుందని వివరించారు.
మెయింటెనెన్స్ కోసం మొదటి సంవత్సరం ప్రభుత్వం ఏమి ఖర్చు చేయదనీ..రెండో సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు 0.4% మాత్రమే చేస్తుందని, 6వ సంవత్సరంలో 0.8%,7వ సంవత్సరంలో రోడ్ రెన్యువల్ కు 2.4%, తర్వాత 8 నుండి 12 సంవత్సరాల వరకు 0.4% శాతం,13 నుండి 0.8%శాతం అని ఇలా మొత్తం 15 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ కోసం అయ్యే ఖర్చు కేవలం 20 లక్షల లోపే అని మంత్రి స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన హ్యామ్ మోడల్ నిబంధనల ప్రకారం ఇంట్రెస్ట్ తో కూడిన మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి, నిర్మాణ సమయంలోనే వడ్డీతో సహా సంబంధిత నిర్మాణ సంస్థ బిల్లుల నుండే రికవరీ చేస్తామని మంత్రి తెలిపారు.
“ఈ హ్యామ్ విధానం తెలంగాణలో కొత్తగా తెచ్చింది కాదు..ఇది వరకే కర్ణాటక రాష్ట్రంలో 20 ఏళ్ల నుండి అమలవుతుంది. అట్లాగే మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్,ఉత్తర ప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో గత ఐదేళ్లుగా అమలులో ఉంది.” అని తెలిపారు.