– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్: ‘‘ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్లు వేరే దేశానికి వెళ్లి బ్రతుకుతారని భావించా. కానీ సిగ్గు లేకుండా ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నార’’ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలా వివిధ పథకాల పేర్లతో రూ.7 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
కేసీఆర్ కొడుకు అంటే అందరూ గుర్తు పడతారని, కానీ కేటీఆర్ అంటే ఆయనను ఎవరూ గుర్తు పట్టరని, అధికారం కోల్పోయినప్పటికీ కేటీఆర్కు అహం తగ్గలేదని, బీఆర్ఎస్ హయాంలో అన్ని దేశాలు తిరిగి పెద్ద డబ్బులు సంపాదించారన్నారు.
“అరె పిచ్చి కేటీఆర్. మీలాగా అమలు చేయలేని హామీలు మేం ఇవ్వలేదు. ఎంత కష్టమైనా నెల మొదటి రోజే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. కేటీఆర్, హరీశ్ రావుకు ఏం పుట్టింది? మీకు రాజకీయాలు చేయడం తెలుసా?” అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
నల్గొండలో అనారోగ్యం బారినపడిన వారు చాలామంది ఉన్నారు ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఫ్లోరైడ్, మరోవైపు కోటిన్నర మంది వాడిన నీరు నల్గొండలో పారుతోంది. మురుగు శుద్ధి కేంద్రాలతో సమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నారు. నగరానికి స్వచ్ఛమైన నీరు అందించాలి. ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బీసీయే అన్నారు.